Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- వ్యక్తిగత విమర్శలే ఉద్రిక్తతలకు కారణం
- భౌతిక దాడులు పిరికిపంద చర్యలే: పొన్నం
- కార్యకర్తలను అదుపులో పెట్టాలన్న మంత్రి
- ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, అయితే అవి హుందాతనాన్ని కోల్పోకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం వల్లే సమాజంలో అశాంతి నెలకొంటోందని, ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నాయకులు తమ స్థాయిని మర్చిపోయి వ్యక్తిగత దూషణలకు దిగడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. “ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించాలి. చౌకబారు ప్రచారం కోసం దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదు. ఒకరి మాటల వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుంటే, దానికి దీటుగా సమాధానం చెప్పాలే తప్ప, భౌతిక దాడులకు దిగడం పిరికిపంద చర్య” అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
ప్రజాప్రతినిధుల ఇళ్లపై మరో ప్రజాప్రతినిధికి చెందిన కార్యకర్తలు దాడులు చేయడం అప్రజాస్వామికమని మంత్రి పేర్కొన్నారు. నాయకులు ఎవరైనా సరే తమ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. “దాడులకు పాల్పడుతున్న కార్యకర్తలపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఆయా నాయకులకు ప్రజాస్వామ్యంపై ఉన్న చిత్తశుద్ధి నిరూపించబడుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రతినిధులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, ప్రజల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా హితవు పలికారు. రాజకీయాలు కేవలం అధికార దాహం కోసం కాకుండా, ప్రజా సేవ కోసం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
-
TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
-
West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
-
Suvendu Adhikari: 13 ఏళ్లలో నలుగురు సన్నిహితుల్ని కోల్పోయిన సువేందు అధికారి..
-
Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..