Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు హల్దీ వాగులో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక శుభకార్యానికి హాజరై, ఆ సంతోషాన్ని పంచుకోవాల్సిన యువకులు విగతజీవులుగా మారడంతో వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన ప్రశాంత్ (27), వికాస్ (27), ఆనంద్ రెడ్డి (27) అనే ముగ్గురు స్నేహితులు బుధవారం నాడు మెదక్ జిల్లా తూప్రాన్లో జరిగిన ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వివాహ వేడుక అనంతరం, గురువారం ఉదయం తిరుగు ప్రయాణంలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం సమీపంలోని హల్దీ వాగు వద్దకు చేరుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. సరదాగా వాగులో ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు.
Also Read
వాగులోకి దిగిన ఈ ముగ్గురు స్నేహితులకు నీటి లోతుపై అవగాహన లేకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గల్లంతైన యువకుల కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం పోలీసులు మరియు గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులంతా ఒకే వయసు వారు (27 ఏళ్లు) కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుటుంబాల్లో విషాదం..
ఒకే ఊరికి చెందిన ముగ్గురు యువకులు, అందులోనూ ప్రాణ స్నేహితులు ఇలా ఒకేసారి మృతి చెందడంతో నర్సాపూర్లో విషాదం నెలకొంది. పెళ్లికి వెళ్లి వస్తామని చెప్పిన కొడుకులు శవాలై రావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జలాశయాలు, వాగుల వద్దకు వెళ్లేటప్పుడు యువత అప్రమత్తంగా ఉండాలని, నీటి లోతు తెలియకుండా లోపలికి వెళ్లడం ప్రాణాంతకమని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
తాజావార్తలు
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
-
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
-
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
-
Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!