TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- తమిళనాడు రాజకీయాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ
- విజయ్ వర్సెస్ గవర్నర్ తీరుపై నెట్టింట ప్రత్యేక చర్చ
- న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు
- ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. విజయ్ వర్సెస్ గవర్నర్ అన్న రీతిలో ఫైటింగ్ సాగుతోంది. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ మొండిపట్టుపై మేధావులు, ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేను ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. విజయ్ మద్దతుగా పోస్ట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోవడంపై విజయ్ న్యాయ నిపుణులతో సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. తదుపరి కార్యాచరణపై మేధావులతో చర్చిస్తున్నారు. న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ లాంటి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
- Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్కు తిరుగులేదు..
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించిన గత పరిస్థితిని న్యాయ బృందం పరిగణనలోకి తీసుకుంటోందని వర్గాలు తెలిపాయి. ఆ విధంగానే విజయ్ను ఎందుకు పిలవడం లేదని.. దీని వెనుక ఏదో కుట్ర జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం చట్టపరమైన, రాజకీయ మార్గాలన్నింటినీ పరిశీలిస్తున్నామని కాంగ్రెస్ ఇన్చార్జ్ ప్రధాన కార్యదర్శి గిరీష్ చోడంకర్ చెప్పారు.
ఇదిలా ఉంటే గవర్నర్ తీరుపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తే తక్షణమే స్పందన రాకపోవచ్చని న్యాయ నిపుణులు చెప్పినట్లు తెలుస్తోంది. అయినా ప్రస్తుతం న్యాయస్థానాలు వేసవి సెలవుల్లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కోర్టును ఆశ్రయించకపోవడమే బెటర్ అన్నట్టుగా సమాచారం. అందుకోసమే తక్షణ కర్తవ్యంగా వామపక్షాలు, వీసీకే పార్టీల మద్దతుతో ముందుకెళ్లాలని విజయ్ భావిస్తున్నారు. ఇప్పుటికే ఆ పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు. ఏ విషయం అన్నది రేపు చెబుతామన్నారు. అంతా సానుకూలం అయితే మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోతాయి.
అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగ విజ్ఞతకు నిలయమైన గవర్నర్కు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమిళనాడులోని అతిపెద్ద పార్టీని పిలవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.’’ అని అన్నారు.
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సోమవారం వెలువడిన ఫలితాల్లో టీవీకే 108, డీఎంకే 59, ఏఐడీఎంకే 47, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, సీవీకే 2, ముస్లిం లీగ్ 2 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ తన మద్దతును విజయ్కు ప్రకటించింది. దీంతో విజయ్ బలం 112కు చేరింది. వామపక్షాలు, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు మద్దతు ఇస్తే మాత్రం విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈజీ అవుతుంది. ఆ పార్టీల దగ్గర 6 సీట్లు ఉన్నాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ 118కు చేరుతుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోతాయి. అయితే రేపు ఏం జరగబోతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?