Bonalu 2024: అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఘటాలు సమర్పించుకున్న మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోల్కొండ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో తెలంగాణ కుమ్మర్ల తొలి బోనాల జాతర జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రులు కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్,జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఘటాలు సమర్పించుకున్నారు మంత్రులు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆషాఢ మాస బోనాల దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొలి కుమ్మర్ల బోనం ఈరోజు కట్ట మైసమ్మ అమ్మవారికి సమర్పిస్తున్నారన్నారు. బోనాల పండుగ హైదరాబాద్ జంట నగరాల సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని, గతంలో బోనం మట్టి కుండలోనే తీసేవారన్నారు.
Also Read
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ఇప్పుడు కూడా బోనం ప్రకృతి పర్యావరణమే కాకుండా అమ్మవారికి ఇష్టమైన మట్టి కుండలోనే చేయాలన్నారు. అలా సమర్పిస్తే మరింత పుణ్యం ఉంటుంది.. ఇతర పాత్ర లలో చేసిన కంటే మట్టి కుండలో చేస్తే ఆశీర్వచనం ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ బోనాలలో పాల్గొనే అందరూ మట్టి కుండలోనే బోనం వాడాలని హైదరాబాద్ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. దేవాదాయ , పర్యావరణ శాఖ మంత్రి గారు ఈ బోనాలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జరగాలన్నారు. కుమ్మర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు వండుకునే వస్తువుల నుండి అన్ని రకాల వస్తువులు తయారు చేస్తుంటారని, కాలం మారుతోంది మళ్ళీ కుల వృత్తి బతకాలంటే ఆ కుల వృత్తులు తయారు చేసే వస్తువులు అందరూ వాడాలన్నారు. కుల వృత్తి బతకాలంటే అమ్మవారి ఆశీర్వాదం పొందాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!