Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ రాజ్యంలో విద్యకు, వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా రూరల్ మండలం నాయుడు పేట గ్రామంలో సియం ఆర్ యప్ చెక్కులను మంత్రి పొంగులేటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. నిత్యము ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, ప్రజల ఆశిస్సుల మేరకు ఒకపక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమ పథకాలను జోడెద్దుల్లాగా నడిపిస్తున్నామన్నారు. ఈ అభివృద్ధిని చూడలేక ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు చేస్తున్నాయని, తొమ్మిదిన్నార ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వారు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఏడు నెలల ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పదవిబోయిన ఏడు నెలలకే అది చేయలేదు ఇది చేయలేదు అంటూ ప్రభుత్వాన్ని దించుతాము అంటున్నారన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే వారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని చెబుతున్నారని ఆయన అన్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు కాబట్టే వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, ఇందిరమ్మ రాజ్యమైతే ఎంతో చల్లగా ఉంటదని ప్రజలు గమనించి ఇందిరమ్మ రాజ్యాన్ని ఎన్నుకున్నారన్నారు. సకాలంలో వానలు పడటంతోటి సాగర్, ఇతర ప్రాజెక్టులు నిండి సమృద్ధిగా రెండు పంటల పండే వర్షాలు కురుస్తున్నాయన్నారు.
అంతేకాకుండా..’ సీతారామ ప్రాజెక్ట్ రీ డిజైన్ పేరుతో బిఅర్ఎస్ పార్టీ గొప్పలకు పోయి పేదోడి సొమ్మును దుర్వినియోగం చేశారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక వీలైనంత పొదుపు చేస్తూ సీతారామ ప్రాజెక్ట్ ను గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజల సొమ్ముని దుర్వినియోగం అవకుండ పూర్తి చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆనాటి బిఅర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ కోసం 8 వేల కోట్లు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 550 కోట్లు పాత పెమెంట్ లు చేశాం..నిద్రపోతున్న కాంట్రాక్టర్లను మేల్కొల్పాం. 1 లక్షా 75 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు 93 కోట్లు ఖర్చు పెట్టీ 9.6 కిలోమీటర్లు ఎన్కూర్ వద్ద లింక్ కెనాల్ ఏర్పాటు చేశాం. ప్రజల సొమ్ము నిరుపయోగంగా ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక యుద్ధప్రాతిపదికన కెనాల్ ను పూర్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పదవి నుండి దిగిపోయే నాటికి రాష్ట్రం యొక్క అప్పు 7 లక్షల 19 వేల కోట్లు. ప్రతి నెల ఈనాటి తెలంగాణ ప్రభుత్వం 6 వేల కోట్లు మిద్ది వివిధ బ్యాంక్ లకు చెల్లిస్తుంది. అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బందులు లేకుండా చిత్తశుద్ధితో 31 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. 31 వేల కోట్లు రైతులకు రుణం చేసే పరిస్థితి ఈనాడు ఈ ప్రభుత్వానికి లేదు. నిబద్ధతతో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తుంది. ‘ అని పొంగుటే వ్యాఖ్యానించారు.
Also Read
- Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
- OTR: 'నో పాలిటిక్స్... ఓన్లీ రూల్స్'.. నిబంధనలకే ప్రాధాన్యం అంటున్న అటవీశాఖ ఉన్నతాధికారి..
- Ravi Bishnoi: రవి బిష్ణోయ్లో అంత చేంజ్ ఎలా వచ్చింది.. ఆ ఒక్క మార్పుతో ఫామ్లోకి వచ్చిన లెగ్ స్పిన్నర్..
- NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
తాజావార్తలు
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
-
OTR: ‘నో పాలిటిక్స్… ఓన్లీ రూల్స్’.. నిబంధనలకే ప్రాధాన్యం అంటున్న అటవీశాఖ ఉన్నతాధికారి..
-
Story Board : రాజధానిని రగిలించారు.. చట్టసభల్ని స్తంభింపజేశారు
-
Prabhas Sreenu: “ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా”.. సినియర్ యాక్టర్తో రూమర్స్పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
-
Prabhas: “నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి”
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!