Amit Shah: లోక్సభ సాక్షిగా ఇండీ కూటమికి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.. నార్త్ – సౌత్ అంటూ విడగొడితే ఖబర్దార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో ఎటువంటి జాప్యం లేదని, 2029 నాటికి మహిళలు పార్లమెంట్లో రిజర్వేషన్లతో అడుగుపెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. పరిసీమన, ఓటు విలువ, విపక్షాల వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల మధ్య ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని అమిత్ షా ఎత్తి చూపారు.
READ ALSO: Women Reservation: సారీ మహిళ.. లోక్సభలో వీగిపోయిన బిల్లు..
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రస్తుతం దేశంలో 127 నియోజకవర్గాల్లో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. కొన్ని చోట్ల 45 లక్షల మందికి ఒక ఎంపీ ఉంటే, మరికొన్ని చోట్ల కేవలం 6 లక్షల మందికే ఒక ప్రతినిధి ఉన్నారు. దీనివల్ల ప్రతి ఓటుకు సమాన విలువ ఉండటం లేదు. ‘ఒక వ్యక్తి-ఒక ఓటు-ఒక విలువ’ అనే సిద్ధాంతం అమలవ్వాలంటే పరిసీమన తప్పనిసరి” అని ఆయన వివరించారు. 2026 తర్వాత జరిగే జనాభా గణన ఆధారంగా ఈ ప్రక్రియ పూర్తి చేసి, మహిళా కోటాను ఖరారు చేస్తామని తెలిపారు.
ఇందిరా గాంధీ నిర్ణయాన్ని గుర్తు చేస్తూ..
పరిసీమనను ఇప్పుడే ఎందుకు తెస్తున్నారన్న విపక్షాల ప్రశ్నకు అమిత్ షా సమాధానమిస్తూ.. 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం సీట్ల సంఖ్యను ఫ్రీజ్ చేసిందని గుర్తు చేశారు. ఆనాటి నిర్ణయం వల్లే ఇప్పుడు మనం ఈ ప్రక్రియను అనుసరించాల్సి వస్తోందని, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే ముందుకు వెళ్తోందని చెప్పారు. ఉత్తర-దక్షిణ భారత దేశాల మధ్య విభజన రేఖలు గీసే ప్రయత్నాలను సహించబోమని ఆయన ఇండీ కూటమిని హెచ్చరించారు. “ఇండీ (INDIA) కూటమి సభ్యులు మహిళా రిజర్వేషన్లను మనస్ఫూర్తిగా స్వాగతించడం లేదు. రాజకీయాల కోసం వారు మతం ఆధారంగా ముస్లిం రిజర్వేషన్లు అడుగుతున్నారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం ఉందో చెప్పాలి” అని ఆయన నిలదీశారు. మహిళా సాధికారతపై విపక్షాలు కేవలం భ్రమలు కల్పిస్తున్నాయని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Parenting Tips : పిల్లల పెంపకంలో మీరు ఈ మాటలు వాడుతున్నారా.? అయితే జాగ్రత్త..!
-
Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
OnePlus Nord CE 6 Lite: వన్ప్లస్ నార్డ్ CE6 లైట్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర సేల్ డేట్ పూర్తి సమాచారం
-
PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది
-
IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!