Lok Sabha Elections 2024: వారసత్వ పన్ను అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ దుమారం..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వారసత్వ పన్ను (ఆస్తి విభజన) విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై ప్రస్తుతం రాజకీయ గందరగోళం నెలకొంది. ప్రధాని మోడీ తన ఎన్నికల ర్యాలీలలో వారసత్వ పన్నును ప్రస్తావిస్తూ కాంగ్రెస్, రాహుల్ గాంధీని నిరంతరం టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశప్రజల ఆస్తిలో సగం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. “కాంగ్రెస్ మేనిఫెస్టోలో జాతీయ స్థాయిలో ఆర్థిక, కులాల సర్వే నిర్వహించాలని చెప్పారని చెప్పాం. ఈ సర్వే ద్వారా అందిన సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటాం” అని తెలిపింది. ఇదిలా ఉండాగా.. ఆర్థికవేత్త గౌతమ్ సేన్, వార్తా సంస్థ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. సంపద పంపిణీ పథకం భారతదేశంలో పనిచేయదన్నారు. దాదాపు 12 కోట్ల మందికి మాత్రమే రూ.102 కోట్లకు పైగా ఆస్తులున్నాయని తెలిపారు. అయితే దాదాపు అందరూ తమ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. అదే సమయంలో, ఆస్తి పంపిణీ కారణంగా, దేశంలోని 98 నుండి 99 శాతం ప్రజల జీవితాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయని స్పష్టం చేశారు.
READ MORE: Weather Report : ఏప్రిల్ నెలలో 19వ శతాబ్దపు రికార్డులను బద్దలు కొట్టిన ఉష్ణోగ్రతలు
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
కాగా.. లోక్సభ ఎన్నికలకు రెండో దశ ఓటింగ్కు ముందు ఆస్తి పంపిణీపై రాజకీయ గందరగోళం నెలకొంది. వారసత్వ పన్నుపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా చేసిన ప్రకటన రాజకీయ దుమారం లేపింది. ఆ ప్రకటనపై భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ను ఇరుకున పెట్టగా, శామ్ పిట్రోడా ప్రకటనకు కాంగ్రెస్ దూరంగా ఉంది. ఆయన ఏమన్నారంటే.. “అమెరికాలో, వారసత్వపు పన్ను చట్టం ఉంది. ఎవరైనా 100 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను కలిగి ఉంటే, అతను చనిపోయినప్పుడు అతని పిల్లలకు 45% మాత్రమే బదిలీ అవుతాయి. ప్రభుత్వం మిగిలిన 55% తీసుకుంటుంది. ఇది ఆసక్తికరమైన చట్టం. మీరు సంపదను సృష్టించారు, మీ సంపదను ప్రజలకు వదిలివేయాలి. మొత్తం కాదు, సగం, ఇది సముచితమని భావిస్తున్నా. దానిని పేదలకు పంచుతాం.” అని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!