Pawan Varahi Yatra: పవన్ కళ్యాణ్కు పోలీసుల ఝలక్.. విశాఖలో వారాహి యాత్రకు ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Varahi Yatra: విశాఖలో రేపటి నుంచి జనసేనాని పవన్కళ్యాణ్ చేపడతున్న వారాహియాత్రపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. మూడో విడత వారాహి యాత్రకు పోలీసులు పలు నిబంధనలు విధించారు. కొన్ని షరతులతో యాత్రకు అనుమతులు జారీ చేశారు. నగరంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని, ఎయిర్పోర్టు నుంచి ర్యాలీగా రావద్దని పోలీసులు షరతులు విధించారు. ఇదిలా ఉండగా.. విశాఖలోని జగదాంబ జంక్షన్లో బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు.
Also Read: Minister Amarnath: బీజేపీతో సంసారం, చంద్రబాబుతో సహజీవనం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
మరోవైపు భవనాలపైకి కార్యకర్తలు, అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేనదేనని, ఉల్లంఘనలు జరిగితే అనుమతి తీసుకున్నవారిదే బాధ్యత అని పోలీసులు షరతులు విఝించారు. ఈ నేపథ్యంలో పోలీసులు విధించిన ఆంక్షలపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసులు పెట్టిన షరతులపై జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. పవన్ కళ్యాణ్ పర్యటనల నేపథ్యంలో.. వారాహి విజయ యాత్రలో గజమాలలు వేయవద్దని జనసేన కార్యకర్తలకు సూచించింది. భద్రత కారణాలను నాయకులు, శ్రేణులు దృష్టిలో ఉంచుకోవాలని వెల్లడించింది.
Also Read: Pawan Kalyan: ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి.. పవన్ సూటి ప్రశ్న
విశాఖ నగరం వేదికగా మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానున్న క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతాపరమైన నిబంధనలను నాయకులు, శ్రేణులు పాటించాలని కోరుతున్నామన్నారు. ఇందులో భాగంగా వారాహి విజయ యాత్రలో, సభా వేదికల వద్దగాని క్రేన్లతో భారీ దండలు, గజమాలలు వేయడం లాంటి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టవద్దన్నారు. యాత్ర వెళ్లే మార్గంలో భారీ క్రేన్లు, వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల వాహన శ్రేణి సాఫీగా సాగడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ భద్రతకు భంగం వాటిల్లకుండా వారాహి విజయ యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా సహకరించాలని జనసేన ట్విట్టర్ వేదికగా సూచించింది. మూడో విడత వారాహి యాత్ర 19వ తేదీ వరకు కొనసాగే అవకాశముంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జనసేన ప్రకటించింది.
శ్రీ @PawanKalyan గారి పర్యటనలు.. వారాహి విజయ యాత్రలో గజమాలలు వద్దు
• భద్రత కారణాలను నాయకులు, శ్రేణులు దృష్టిలో ఉంచుకోవాలి pic.twitter.com/vEYi0dJpkt
— JanaSena Party (@JanaSenaParty) August 9, 2023
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!