Nimmala Ramanaidu: పోలవరం ప్రాజెక్ట్పై కీలక అప్డెట్.. అప్పటి వరకు పూర్తి చేస్తామని మంత్రి హామీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmala Ramanaidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పనులు సాగుతున్నాయని, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తాజాగా అమరావతిలోఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు మొత్తం 87 శాతం పూర్తయ్యాయన్నారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం 1034 మీటర్ల వరకు పూర్తయిందని వెల్లడించారు. 2026 సాగు సీజన్ ప్రారంభమయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. జనవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారని తెలిపారు. అలాగే 456 కోట్ల రూపాయల వ్యయంతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులను చంద్రబాబు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
READ MORE: Love jihad: హిందువుగా నటిస్తూ వివాహితను మోసం చేసిన ముస్లిం వ్యక్తి..
Also Read
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
- Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
- WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వాన్ని మంత్రి తీవ్రంగా విమర్శించారు. నాడు పోలవరం ప్రాజెక్టును, డయాఫ్రం వాల్ను ధ్వంసం చేసిన వైసీపీ ఇప్పుడు తమ పత్రికల్లో రాయడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. కేంద్రం రీయింబర్స్ చేసిన 3800 కోట్ల రూపాయలను కూడా మళ్లించి జగన్ పోలవరాన్ని ముంచేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితుల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ఒక్క ఏడాదిలోనే నిర్వాసితుల కోసం 1894 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టుల పూర్తి ద్వారా రైతులకు సాగునీరు అందించి రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
READ MORE: VC Sajjanar: న్యూ ఇయర్ వేళ సీపీ సీరియస్ వార్నింగ్.. ఈ 120 ప్రాంతాల్లో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’!
తాజావార్తలు
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ సేల్ స్టార్ట్.. రూ. 10000 డిస్కౌంట్! 6,000mAh బ్యాటరీ, 8.1-అంగుళాల స్క్రీన్
-
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
-
Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!