Nimmala Ramanaidu: పోలవరం ప్రాజెక్ట్పై కీలక అప్డెట్.. అప్పటి వరకు పూర్తి చేస్తామని మంత్రి హామీ!
Nimmala Ramanaidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పనులు సాగుతున్నాయని, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తాజాగా అమరావతిలోఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు మొత్తం 87 శాతం పూర్తయ్యాయన్నారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం 1034 మీటర్ల వరకు పూర్తయిందని వెల్లడించారు. 2026 సాగు సీజన్ ప్రారంభమయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. జనవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారని తెలిపారు. అలాగే 456 కోట్ల రూపాయల వ్యయంతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులను చంద్రబాబు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
READ MORE: Love jihad: హిందువుగా నటిస్తూ వివాహితను మోసం చేసిన ముస్లిం వ్యక్తి..
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వాన్ని మంత్రి తీవ్రంగా విమర్శించారు. నాడు పోలవరం ప్రాజెక్టును, డయాఫ్రం వాల్ను ధ్వంసం చేసిన వైసీపీ ఇప్పుడు తమ పత్రికల్లో రాయడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. కేంద్రం రీయింబర్స్ చేసిన 3800 కోట్ల రూపాయలను కూడా మళ్లించి జగన్ పోలవరాన్ని ముంచేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితుల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ఒక్క ఏడాదిలోనే నిర్వాసితుల కోసం 1894 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టుల పూర్తి ద్వారా రైతులకు సాగునీరు అందించి రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
READ MORE: VC Sajjanar: న్యూ ఇయర్ వేళ సీపీ సీరియస్ వార్నింగ్.. ఈ 120 ప్రాంతాల్లో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’!
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?