PM Modi: నేడు ప్రధాని మోడీ 74వ పుట్టిన రోజు.. ‘‘సేవా పర్వ్’’గా నిర్వహిస్తున్న బీజేపీ..
- నేడు ప్రధాని నరేంద్రమోడీ 74వ పుట్టిన రోజు..
- దేశ-విదేశీ నేతల నుంచి శుభాకాంక్షలు..
- ‘‘సేవా పర్వ్’’గా నిర్వహిస్తున్న బీజేపీ..
- ఒడిశాలో పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్న మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ 74వ పుట్టిన రోజు సందర్భంగా దేశ, విదేశీ నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. పుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మంగళవారం 74వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. విజన్ ఉన్న నాయకుడు, భారతదేశ ముద్దుబిడ్డ అంటూ విషెస్ చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా ప్రధాని మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ప్రధాని నరేంద్ర మోడీకి నా పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను ఆయనకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షును కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ప్రధాని మోడీ నాయకత్వంలో, భారతదేశం ఆర్థికంగా అగ్రరాజ్యంగా ఎదుగుతోంది, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే తన సంకల్పాన్ని నెరవేర్చే శక్తిని నేను కోరుకుంటున్నాను. భారత్ 5 ట్రిలియన్ల ఎకానమిగా మారేందుకు ప్రధాని మోడీ సంకల్పాన్ని నెరవేర్చడానికి మహారాష్ట్ర కూడా అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. 21వ శతాబ్ధం, భారత శతాబ్ధం ఎందుకంటే దేశానికి కెప్టెన్గా ఉన్నది ప్రధానిమోడీ’’ అని షిండే అన్నారు.
Read Also: Big Breaking: ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన..
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరిన్ని కష్టాలు.. షాకిస్తున్న ఎంపీలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Emmanuel Macron: భారత్ ఆవిష్కరణల దేశం.. మేక్ ఇన్ ఇండియాకు మా పూర్తి గౌరవం: మాక్రాన్
- War Effect: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. ఒమన్ గల్ఫ్లో చిక్కుకుపోయిన 13 భారతీయ నౌకలు...
ప్రధానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర రాజకీయ నాయకులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మోడీ పుట్టిన రోజుని ‘‘సేవా పర్వ్’’గా బీజేపీ నిర్వహిస్తోంది. సెప్టెంబరు 17, 1950న గుజరాత్లోని మెహసానా పట్టణంలో జన్మించిన నరేంద్ర దామోదరదాస్ మోడీ అంచెలంచెలుగా ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రి, దేశ ప్రధానిగా అత్యున్నత స్థానాలను అధిరోహించారు. సాధారణ చాయ్ వాలా నుంచి దేశానికి అధినేత అయ్యారు. వరసగా మూడుసార్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు తీసుకున్నారు.
ప్రధాని తన 74వ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం భువనేశ్వర్లో గడకానాలో 26 లక్షల పీఎం ఆవాస్ ఇళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. భువనేశ్వర్లో పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారులతో ముచ్చటించనున్నారు. అనంతరం జనతా మైదాన్లో సుభద్ర యోజన పథకాన్ని ప్రారంభించనున్నారు. సుభద్ర యోజన కింద ప్రతి సంవత్సరం 1 కోటి మందికి పైగా పేద మహిళలకు ఐదు సంవత్సరాల పాటు రెండు సమాన వాయిదాలలో ఏడాదికి రూ. 10,000 ఆర్థిక సాయం అందనుంది. జగన్నాథుని సోదరి అయిన సుభద్ర దేవి పేరు మీద ఆర్థిక సహాయ పథకం ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
TMC Crisis: మమత బెనర్జీకి మరిన్ని కష్టాలు.. షాకిస్తున్న ఎంపీలు..
-
Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
-
Ram Charan: ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ – శ్రీకాంత్ ఓదెల మూవీపై క్రేజీ బజ్!
-
Emmanuel Macron: భారత్ ఆవిష్కరణల దేశం.. మేక్ ఇన్ ఇండియాకు మా పూర్తి గౌరవం: మాక్రాన్
-
War Effect: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. ఒమన్ గల్ఫ్లో చిక్కుకుపోయిన 13 భారతీయ నౌకలు…
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?