Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Pm Narendra Modi Tour In Telangana Tomorrow

Narendra Modi : రేపు తెలంగాణకు మోడీ.. విద్యుద్దీకరణ ప్రాజెక్టు జాతికి అంకితం

Published Date :March 3, 2024 , 4:34 pm
By Gogikar Sai Krishna
Narendra Modi : రేపు తెలంగాణకు మోడీ.. విద్యుద్దీకరణ  ప్రాజెక్టు జాతికి అంకితం
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అంబారి- ఆదిలాబాద్ – పింపల్ కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టును 04 మార్చి, 2024న ఆదిలాబాద్‌లో జాతికి అంకితం చేయనున్నారు. అంబారి – ఆదిలాబాద్ – పింపల్ కుట్టి మధ్య విద్యుద్దీకరణ ముద్ఖేడ్ – పింపల్ కుట్టి విద్యుద్దీకరణ పనుల ప్రాజెక్ట్‌ లో భాగం. అంబారి – ఆదిలాబాద్ – పింపల్ కుట్టి సెక్షన్‌లోని 58 రూట్ కిమీ (71 ట్రాక్ కిమీలు) సుమారు రూ. 70 కోట్ల అంచనా వ్యయంతో విద్యుద్దీకరించబడింది. ఈ రైల్వే లైన్ విభాగం తెలంగాణలోని ఆదిలాబాద్ ( 46.6 రూట్ కిమీ)లోని వెనుకబడిన జిల్లాలు మహారాష్ట్రలోని నాందేడ్ యవత్మాల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో (11.5 రూట్ కిమీ) విస్తరించిఉంది .

ఈ ముఖ్యమైన విభాగం సికింద్రాబాద్‌ను నాగ్‌పూర్ వైపు ( నిజామాబాద్ మీదుగా ) ఆ తర్వాత కలిపే రైల్వే లైన్‌లో వస్తుంది. ఈ రైలు మార్గ విద్యుద్దీకరణ వలన ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ / సికింద్రాబాద్ మరియు బెంగళూరు వైపు దక్షిణాన అలాగే నాగ్‌పూర్ మరియు ఆ తర్వాత ఉత్తర భారత దేశం వైపు విద్యుద్దీకరించబడిన నిరంతర రైలు అనుసంధానం కలిగిస్తుంది. ఇది ఇంజిన్ మార్పిడి అవసరం లేకుండా పోవడం వలన రైళ్ల నిలుపుదల సమయంలో ఆదాచేస్తుంది, తద్వారా ప్రయాణీకుల మరియు సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా, డీజిల్ ఇంధనంతో నడిచే రైళ్ల కారణంగా వచ్చే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తద్వారా వార్షిక ఇంధన ఖర్చులలో ఆదా చేకూరుతుంది. ఇంతేకాకుండా పత్తి, మిరపకాయలు పప్పుధాన్యాలు మరియు మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తులకు సురక్షితమైన, వేగవంతమైన మరియు తక్కువ ధరతో సరకు రవాణాను అందించడం వలన ఆదిలాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతగానో లాభం చేకూరుతుంది.

Also Read

  • Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
  • Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
  • Bengal Repolling: పశ్చిమ బెంగాల్‌లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
  • UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..

ఇటీవలి కాలంలో రైలు అభివృద్ధి కార్యక్రమాలలో గతoలో ఏనాడూ లేనట్టి వృద్ధికి తెలంగాణ సాక్షిగా నిలిచింది. నేడు, రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ పెట్టుబడులు భారీగా పెరగడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైలు మౌలిక సదుపాయాల కల్పన శరవేగంగా ముందుకు సాగుతోంది. తెలంగాణకు రైలు బడ్జెట్ కేటాయింపులో 2014-15 సంవత్సరంలో నున్న రూ 258 కోట్లతో పోలిస్తే గత 10 ఏళ్లలో దాదాపు 20 రెట్లు అనగా 2024-25 సంవత్సరానికి రూ 5,071 కోట్లకు పెంచండం జరిగింది. తత్ఫలితంగా రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇది ఎంతోగానో దోహదపడింది. రాష్ట్రంలో ఈ వృద్ధికి కీలకమైన అంశాలలో రైలు నెట్‌వర్క్ విద్యుద్దీకరణ ఒక భాగం. “మిషన్ ఎలక్ట్రిఫికేషన్”లో భాగంగా, తెలంగాణలోని మొత్తం రైల్వే నెట్‌వర్క్(నిర్మాణంలో ఉన్నవి మినహాయిస్తే)విద్యుద్దీకరించబడింది. గత 10 సంవత్సరాలలో, రాష్ట్రవ్యాప్తంగా1,753 ట్రాక్ కిలోమీటర్ల రైలు నెట్‌వర్క్ విద్యుద్దీకరించబడింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • PM Narendra Modi
  • telugu news

తాజావార్తలు

  • Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు

  • Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..

  • Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?

  • Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్

  • Bengal Repolling: పశ్చిమ బెంగాల్‌లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions