Narendra Modi : రేపు తెలంగాణకు మోడీ.. విద్యుద్దీకరణ ప్రాజెక్టు జాతికి అంకితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అంబారి- ఆదిలాబాద్ – పింపల్ కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టును 04 మార్చి, 2024న ఆదిలాబాద్లో జాతికి అంకితం చేయనున్నారు. అంబారి – ఆదిలాబాద్ – పింపల్ కుట్టి మధ్య విద్యుద్దీకరణ ముద్ఖేడ్ – పింపల్ కుట్టి విద్యుద్దీకరణ పనుల ప్రాజెక్ట్ లో భాగం. అంబారి – ఆదిలాబాద్ – పింపల్ కుట్టి సెక్షన్లోని 58 రూట్ కిమీ (71 ట్రాక్ కిమీలు) సుమారు రూ. 70 కోట్ల అంచనా వ్యయంతో విద్యుద్దీకరించబడింది. ఈ రైల్వే లైన్ విభాగం తెలంగాణలోని ఆదిలాబాద్ ( 46.6 రూట్ కిమీ)లోని వెనుకబడిన జిల్లాలు మహారాష్ట్రలోని నాందేడ్ యవత్మాల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో (11.5 రూట్ కిమీ) విస్తరించిఉంది .
ఈ ముఖ్యమైన విభాగం సికింద్రాబాద్ను నాగ్పూర్ వైపు ( నిజామాబాద్ మీదుగా ) ఆ తర్వాత కలిపే రైల్వే లైన్లో వస్తుంది. ఈ రైలు మార్గ విద్యుద్దీకరణ వలన ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ / సికింద్రాబాద్ మరియు బెంగళూరు వైపు దక్షిణాన అలాగే నాగ్పూర్ మరియు ఆ తర్వాత ఉత్తర భారత దేశం వైపు విద్యుద్దీకరించబడిన నిరంతర రైలు అనుసంధానం కలిగిస్తుంది. ఇది ఇంజిన్ మార్పిడి అవసరం లేకుండా పోవడం వలన రైళ్ల నిలుపుదల సమయంలో ఆదాచేస్తుంది, తద్వారా ప్రయాణీకుల మరియు సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా, డీజిల్ ఇంధనంతో నడిచే రైళ్ల కారణంగా వచ్చే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తద్వారా వార్షిక ఇంధన ఖర్చులలో ఆదా చేకూరుతుంది. ఇంతేకాకుండా పత్తి, మిరపకాయలు పప్పుధాన్యాలు మరియు మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తులకు సురక్షితమైన, వేగవంతమైన మరియు తక్కువ ధరతో సరకు రవాణాను అందించడం వలన ఆదిలాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతగానో లాభం చేకూరుతుంది.
Also Read
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
- US-Iran: తాజా దాడులతో శాంతి చర్చలపై నీలినీడలు.. రగిలిపోతున్న ఇరాన్
ఇటీవలి కాలంలో రైలు అభివృద్ధి కార్యక్రమాలలో గతoలో ఏనాడూ లేనట్టి వృద్ధికి తెలంగాణ సాక్షిగా నిలిచింది. నేడు, రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ పెట్టుబడులు భారీగా పెరగడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైలు మౌలిక సదుపాయాల కల్పన శరవేగంగా ముందుకు సాగుతోంది. తెలంగాణకు రైలు బడ్జెట్ కేటాయింపులో 2014-15 సంవత్సరంలో నున్న రూ 258 కోట్లతో పోలిస్తే గత 10 ఏళ్లలో దాదాపు 20 రెట్లు అనగా 2024-25 సంవత్సరానికి రూ 5,071 కోట్లకు పెంచండం జరిగింది. తత్ఫలితంగా రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇది ఎంతోగానో దోహదపడింది. రాష్ట్రంలో ఈ వృద్ధికి కీలకమైన అంశాలలో రైలు నెట్వర్క్ విద్యుద్దీకరణ ఒక భాగం. “మిషన్ ఎలక్ట్రిఫికేషన్”లో భాగంగా, తెలంగాణలోని మొత్తం రైల్వే నెట్వర్క్(నిర్మాణంలో ఉన్నవి మినహాయిస్తే)విద్యుద్దీకరించబడింది. గత 10 సంవత్సరాలలో, రాష్ట్రవ్యాప్తంగా1,753 ట్రాక్ కిలోమీటర్ల రైలు నెట్వర్క్ విద్యుద్దీకరించబడింది.
తాజావార్తలు
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
-
Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
-
GT vs RCB: సిక్సర్ల సునామీ.. స్టేడియంలో ఆర్సీబీ శివతాండవం! గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే 255 కొట్టాల్సిందే..
-
Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!