PM Modi: ప్రపంచం మొత్తం భారత్ వైపే.. బాధితులకు న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నా..
- నేడు మన్కీ బాత్ కార్యక్రమలో ప్రసంగించిన మోడీ
- పహల్గాం ఉగ్రవాద దాడిపై స్పందించిన ప్రధాని
- ఉగ్రవాదులు పిరికితనాన్ని ప్రదర్శించారు
- ప్రతి భారతీయుడు కోపంతో మండిపోతున్నారు
- బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుంది
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతాపం వ్యక్తం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన హృదయం చాలా విచారంగా ఉందని.. ప్రతి భారతీయుడు కోపంతో మండిపోతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. పహల్గాంలో ఉగ్రవాదులు పిరికితనాన్ని ప్రదర్శించారని విమర్శించారు. శత్రువులకు దేశ అభివృద్ధి నచ్చడం లేదని.. దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం భారత్కు అండగా నిలిచిందని.. పహల్గాం బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భారోసా ఇచ్చారు.
READ MORE: Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. తొలి బ్యాట్స్మన్గా..!
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
“కశ్మీర్లో శాంతి తిరిగి నెలకొంటోంది. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యటకుల సంఖ్య పెరుగుతోంది. శత్రువులకు ఇది నచ్చడం లేదు. ఉగ్రవాద నాయకులు కశ్మీర్ను మళ్లీ నాశనం చేయాలని కోరుకుంటున్నారు. అందుకే ఇన్ని కుట్రలు పన్నుతున్నారు. ఈ తరుణంలో మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఈ సవాలును ధీటుగా ఎదుర్కోవాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను. దాడికి పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తాం.” అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అనంతరం.. ఇస్రో మాజీ చీఫ్, శాస్త్రవేత్త కె. కస్తూరిరంగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కస్తూరిరంగన్ తన జీవితాంతం నిస్వార్థంగా దేశానికి సేవ చేశారని కొనియాడారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేమని స్పష్టం చేశారు.
READ MORE: Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి కేసు పగ్గాలు స్వీకరించిన NIA..
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!