Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి కేసు పగ్గాలు స్వీకరించిన NIA..
- ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాద దాడి
- ఎన్ఐఏ చేతికి ఉగ్రవాద దాడి కేసు పగ్గాలు
- హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ
- కుట్రను వెలికితీసేందుకు లోతైన దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి అప్పగించింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాని ఫ్రంట్ ఆర్గనైజేషన్ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) ఈ దాడి చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దాడి వెు పాక్ హస్తం ఉందనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
READ MORE: Indian Navy: దేనికైనా రెడీ.. యాంటీ షిప్ మిసైల్స్ను పరీక్షించిన భారత నౌకాదళం!
Also Read
పహల్గాం దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఐఏ ఇప్పుడు ఈ కేసును జమ్మూ కశ్మీర్ పోలీసుల నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఉంది. ఈ దాడి వెనుక ఉన్న విస్తృత ఉగ్రవాద నెట్వర్క్, కుట్రను వెలికితీసేందుకు సంస్థ లోతైన దర్యాప్తు ప్రారంభించనుంది. ఇప్పటికే ఘటనా స్థలంలో ఎన్ఐఏ బృందం ఆధారాలు సేకరిస్తోంది. ఈ బృందంలో ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీకి చెందిన ఐజీ, డీఐజీ, ఎస్పీ ఉన్నారు. ఉగ్రదాడిని చూసిన సాక్షులను అధికారులు ప్రశ్నించనున్నారు.
READ MORE: Virat Kohli vs KL Rahul: ఊరమాస్ లెవెల్లో రాహుల్ వార్నింగ్.. ప్రతీకారానికి సిద్దమైన కోహ్లీ!
దాడి నుంచి బయటపడిన వారి వాంగ్మూలాలను నమోదు చేయనుంది. అలాగే.. లష్కరే, జైష్-ఎ-మొహమ్మద్, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన అరెస్టయిన ఉగ్రవాదులను ఈ దాడిపై ప్రశ్నిస్తుంది. పలు ఆధారాల ద్వారా ఈ దాడిలో పాకిస్థాన్ ప్రత్యక్ష ప్రమేయం ఉందని భారత్ నిర్ధారిస్తోంది. కాగా.. బైసరన్ లోయలో 26 మంది అమాయక పౌరులను చంపిన వారి కోసం ఇప్పటికే భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త దళం వెతుకుతోంది.
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!