PM Modi: రేపు చెన్నైకి ప్రధాని మోదీ.. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం, వందేభారత్ రైలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించనున్నారు. చెన్నై విమానాశ్రయంలో మొత్తం రూ.2,437 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనంతో సహా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా నగరం అంతటా భద్రతను పెంచారు. అయితే విస్తృతమైన ట్రాఫిక్ మళ్లింపులు చేసినందున వాహనదారులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి వారి ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కోరినట్లు పోలీసులు తెలిపారు. విమానాశ్రయ ప్రయాణికుల కోసం ఐదేళ్ల కిందటే విమానాశ్రయ కొత్త టెర్మినల్ నిర్మాణం చేపట్టారు.
చెన్నై రాగానే ప్రధాని మోదీ కొత్త టెర్మినల్ను ప్రారంభిస్తారు. దాని మొదటి దశ పూర్తయింది. ఇది ప్రయాణీకుల రద్దీని సంవత్సరానికి 35 మిలియన్లకు పెంచుతుందని భావిస్తున్నారు. చెన్నై విమానాశ్రయ అధికారుల ప్రకారం, కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ 2.20 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది తమిళనాడులో పెరుగుతున్న విమాన ట్రాఫిక్కు అనుగుణంగా ఉంటుంది. ఈ టెర్మినల్ ప్రయాణికులకు అధిక-నాణ్యత మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ప్రతిబింబం అని వారు చెప్పారు.
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
Read Also: Gaj Utsav in Assam: ప్రాజెక్ట్ ఎలిఫెంట్కు 30 ఏళ్లు.. గజ్ ఉత్సవ్ను ప్రారంభించిన రాష్ట్రపతి
“ఏటా 35 మిలియన్ల మంది ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యంతో, చెన్నై విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యం అందరికీ విమాన ప్రయాణ అనుభవాలను మెరుగుపరుస్తుంది” అని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. టెర్మినల్లో 108 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయి. ఇవి రాక, బయలుదేరే ప్రాంతాల మధ్య సమానంగా విభజించబడ్డాయి. ఇది రవాణా ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ప్రయాణీకులకు ప్రయాణ అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.
ఇంటిగ్రేటెడ్ కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవంతో పాటు, చెన్నై మరియు కోయంబత్తూర్ మధ్య వందే భారత్ రైలును ఇక్కడి పురట్చి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రెండు నగరాల మధ్య బుధవారం మినహా అన్ని రోజుల్లో హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపాలని దక్షిణ రైల్వే యోచిస్తోంది. ఈ రైలు 5.50 గంటల్లో ఇరువైపులా 130 కిమీ వేగంతో గమ్యస్థానానికి చేరుకుంటుందని తద్వారా ఎక్స్ప్రెస్ రైళ్లతో పోలిస్తే 1.20 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుందని దక్షిణ రైల్వే తెలిపింది. తర్వాత, కామరాజర్ సాలై (బీచ్ రోడ్)లోని వివేకానందర్ ఇల్లమ్లోని రామకృష్ణ మఠం 125వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. పల్లవరంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు.
తాజావార్తలు
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!