PM Modi: రేపు చెన్నైకి ప్రధాని మోదీ.. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం, వందేభారత్ రైలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించనున్నారు. చెన్నై విమానాశ్రయంలో మొత్తం రూ.2,437 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనంతో సహా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా నగరం అంతటా భద్రతను పెంచారు. అయితే విస్తృతమైన ట్రాఫిక్ మళ్లింపులు చేసినందున వాహనదారులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి వారి ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కోరినట్లు పోలీసులు తెలిపారు. విమానాశ్రయ ప్రయాణికుల కోసం ఐదేళ్ల కిందటే విమానాశ్రయ కొత్త టెర్మినల్ నిర్మాణం చేపట్టారు.
చెన్నై రాగానే ప్రధాని మోదీ కొత్త టెర్మినల్ను ప్రారంభిస్తారు. దాని మొదటి దశ పూర్తయింది. ఇది ప్రయాణీకుల రద్దీని సంవత్సరానికి 35 మిలియన్లకు పెంచుతుందని భావిస్తున్నారు. చెన్నై విమానాశ్రయ అధికారుల ప్రకారం, కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ 2.20 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది తమిళనాడులో పెరుగుతున్న విమాన ట్రాఫిక్కు అనుగుణంగా ఉంటుంది. ఈ టెర్మినల్ ప్రయాణికులకు అధిక-నాణ్యత మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ప్రతిబింబం అని వారు చెప్పారు.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
Read Also: Gaj Utsav in Assam: ప్రాజెక్ట్ ఎలిఫెంట్కు 30 ఏళ్లు.. గజ్ ఉత్సవ్ను ప్రారంభించిన రాష్ట్రపతి
“ఏటా 35 మిలియన్ల మంది ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యంతో, చెన్నై విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యం అందరికీ విమాన ప్రయాణ అనుభవాలను మెరుగుపరుస్తుంది” అని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. టెర్మినల్లో 108 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయి. ఇవి రాక, బయలుదేరే ప్రాంతాల మధ్య సమానంగా విభజించబడ్డాయి. ఇది రవాణా ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ప్రయాణీకులకు ప్రయాణ అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.
ఇంటిగ్రేటెడ్ కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవంతో పాటు, చెన్నై మరియు కోయంబత్తూర్ మధ్య వందే భారత్ రైలును ఇక్కడి పురట్చి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రెండు నగరాల మధ్య బుధవారం మినహా అన్ని రోజుల్లో హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపాలని దక్షిణ రైల్వే యోచిస్తోంది. ఈ రైలు 5.50 గంటల్లో ఇరువైపులా 130 కిమీ వేగంతో గమ్యస్థానానికి చేరుకుంటుందని తద్వారా ఎక్స్ప్రెస్ రైళ్లతో పోలిస్తే 1.20 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుందని దక్షిణ రైల్వే తెలిపింది. తర్వాత, కామరాజర్ సాలై (బీచ్ రోడ్)లోని వివేకానందర్ ఇల్లమ్లోని రామకృష్ణ మఠం 125వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. పల్లవరంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!