UAE: నేడు యూఏఈలో హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BAPS Hindu Temple: ముస్లిం దేశంలో తొలి ఐకానిక్ బీఏపీఎస్ హిందూ ఆలయాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అలాగే, అక్కడున్న హిందూ కమ్యూనిటీని ఉద్దేశించి మోడీ ప్రసంగించబోతున్నారు.సుమారు 700 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ అద్భుత ఆలయాన్ని బీఏపీఎస్ స్వామినారాయణ్ ఇనిస్టిట్యూట్ నిర్మించింది. ఈ ఆలయాన్ని నిర్మించడంలో ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహరాజ్ సహకారం ఉంది.
Read Also: CM YS Jagan: రేపు రెండు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
Also Read
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
కాగా, యూఏఈలో ప్రారంభిస్తున్న తొలి హిందూ దేవాలయం.. అబుదాబిలోని అబు మురీఖా ప్రాంతంలో ఈ మందిరం 27 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆలయం ప్రారంభానికి దాదాపు 2 నుంచి 5 వేల మంది భక్తులు టెంపుల్ ను సందర్శఇంచే ఛాన్స్ ఉందని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ లో శంకుస్థాపన చేయగా.. అదే ఏడాది డిసెంబర్ లో ఆలయ నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి. క్రౌన్స్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆలయ నిర్మాణం కోసం 2015లో 13.5 ఎకరాల భూమిని విరాళంగా అందించారు.. 2019 జనవరిలో యూఏఈ ప్రభుత్వం మరో 13.5 ఎకరాలను ఆలయ నిర్మాణం కోసం గిఫ్ట్ ఇచ్చింది. ఈ హిందూ ఆలయ నిర్మాణానికి సుమారు 400 మిలియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ లు ( రూ. 700 కోట్లు ) అయ్యాయి.
Read Also: Pakistan: ప్రధాని బాధ్యతలపై నవాజ్ షరీఫ్ కీలక నిర్ణయం.. పాకిస్థాన్ పీఎంగా అతడే..
ఇక, యూఏఈలో 27 ఎకరాలలో నిర్మించిన ఈ ఆలయంలో భారతీయ శిల్పకళాసౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడుతుంది. ఈ ఆలయం ఎత్తు 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మందిర నిర్మించారు. ఈ ఆలయానికి ఏడు గోపురాలున్నాయి.. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్కు ఈ గోపురాలు ప్రతీకగా తీర్చిదిద్దారు. ఈ ఆలయ నిర్మాణంలో కాంక్రీట్, స్టీల్, సిమెంట్ వాడకుండా రాజస్థాన్ నుంచి తెప్పించిన పాలరాతిని వినియోగించారు.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!