Rapid Train: పరుగు పెట్టనున్న ఫస్ట్ ర్యాపిడ్ ట్రైన్.. ఎప్పుడు, ఎక్కడ నుంచి అంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapid Train: భారతదేశం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అయితే, దీన్ని ప్రారంభించే ఖచ్చితమైన తేదీ, సమయం ఇంకా నిర్ణయించబడలేదు. అయితే ఈ నెలాఖరులోగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. గురువారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాహిబాబాద్లోని రాపిడెక్స్ స్టేషన్కు చేరుకుని ఏర్పాట్లు జరుగుతున్న స్టేషన్ ను పరిశీలించారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సిఆర్టిసి) సీనియర్ అధికారులు ముఖ్యమంత్రికి వీడియో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దీనిలో అన్ని సంబంధిత అంశాలపై వివరణాత్మక సమాచారం ఇవ్వబడింది.
విశేషమేమిటంటే.. ఈ వ్యవస్థ పూర్తయితే ఢిల్లీ నుంచి మీరట్ ప్రయాణం మరింత సులువవుతుంది. అలాగే ప్రయాణ సమయం కూడా 40 శాతం తగ్గుతుంది. ప్రస్తుతం బస్సులో ఢిల్లీ నుండి మీరట్కు ప్రయాణ సమయం 120 నుండి 150 నిమిషాలు. కారులో ఢిల్లీ నుండి మీరట్కు ప్రయాణ సమయం కూడా దాదాపు 120 నిమిషాలు. అయితే ర్యాపిడ్ రైలుతో ఈ సమయాన్ని 90 నిమిషాలు లేదా అంతకంటే తక్కువకు తగ్గించవచ్చు.
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Read Also:Prabhas: పది రోజుల్లో పాన్ ఇండియా స్టార్ బర్త్ డే…
ప్రాధాన్యత గల కారిడార్ మార్గం
ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS కారిడార్ ప్రాధాన్యత విభాగం ఆపరేషన్ కోసం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం, 17 కి.మీ పొడవైన ప్రాధాన్యత విభాగం సాహిబాబాద్ నుండి దుహై వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాధాన్యత విభాగంలో ఐదు స్టేషన్లు ఉంటాయి. ఇందులో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధర్, దుహై, దుహై డిపోలు ఉన్నాయి.
RAPIDEX సేవ ప్రాముఖ్యత ఏమిటి?
ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS కారిడార్లో ప్రాంతీయ రైలు సేవలను ప్రవేశపెట్టడంతో.. ప్రజలు దేశ రాజధాని – మీరట్ మధ్య వేగంగా ప్రయాణించవచ్చు. RAPIDX సేవ ఆధునిక, స్థిరమైన, అనుకూలమైన, వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ మార్గాలను అందిస్తుంది. మొత్తం కారిడార్ పూర్తయిన తర్వాత RRTS ఢిల్లీ – మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని 40 శాతం తగ్గిస్తుంది. ఎన్సిఆర్టిసి మొత్తం ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ను 2025 నాటికి ప్రజల ఉపయోగం కోసం తెరవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also:Rakul Preet Singh: చూపులతో మదిని కొల్లగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్..
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!