Lok Sabha Elections 2024: తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో మూడు గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52.34 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. గత ఎన్నికల్లో కంటే ఈ ఏడాది లోక్సభ ఎన్నికల్లో అధిక ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్ రాజ్ వెల్లడించారు. ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మధ్యాహ్నం 3.00 గంట వరకు పోలింగ్ 62.44 శాతం నమోదైనట్లు తెలిసింది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also:Patient On Stretcher Voted: స్ట్రెచర్ పై పోలింగ్ బూత్కి వెళ్లి మరీ ఓటు వేసిన మహిళ..
లోక్సభ నియోజక వర్గాల వారీగా పోలింగ్ శాతాలు ఇలా..
*ఆదిలాబాద్ -62.44 శాతం
*భువనగిరి -62.05 శాతం
*చేవెళ్ల -45.35 శాతం
*హైదరాబాద్ -29.47 శాతం
*కరీంనగర్-58.24 శాతం
*ఖమ్మం-63.67 శాతం
*మహబూబాబాద్-61.40 శాతం
*మహబూబ్నగర్-58.92 శాతం
*మల్కాజిగిరి-37.69 శాతం
*మెదక్-60.94 శాతం
*నాగర్ కర్నూల్ -57.17 శాతం
*నల్గొండ-59.91 శాతం
*నిజామాబాద్-58.70 శాతం
*పెద్దపల్లి-55.92 శాతం
*సికింద్రాబాద్-34.58 శాతం
*వరంగల్-54.17 శాతం
*జహీరాబాద్-63.96 శాతం
*సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం..39.92 శాతం ఓటింగ్ నమోదు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!