Gandhi Jayanti: జాతిపిత గాంధీకి భారతావని ఘన నివాళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhi Jayanti: భారతదేశం అంతటా, జాతీయ నాయకులు జాతిపిత 153వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం రాజ్ ఘాట్ లో జాతిపిత గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మహాత్ముడు నమ్మిన సత్యం, అహింస మార్గంలో నడవాలని దేశ ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరు తమ జీవిత విలువలకు తమను తాము పునఃసమీక్షించుకోవడానికి మహాత్ముడి జయంతి ఓ సందర్భంగా ఆమె అభివర్ణించారు. మహాత్ముడి అడుగుజాడల్లో ప్రతి భారతీయుడు నడవాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ సంవత్సరం వేడుకలు భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను గుర్తించడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీకి నివాళిగా ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయన దేశ ప్రజలను కోరారు. ఎల్లప్పుడూ బాపు ఆశయాలకు అనుగుణంగా జీవించాలన్నారు.
Also Read
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
Read also: puducherry: అంధకారంలో పుదుచ్చేరి.. గవర్నర్, సీఎం ఇళ్లకు పవర్ కట్
ఢిల్లీలోని రాజ్ఘాట్లో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ తన యాత్రకు నేడు విరామం ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సత్యం, అహింస, శాంతి, మార్గదర్శకుడికి తాను నమస్కరిస్తున్నాన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!