PM Modi: అయోధ్య రాముడ్ని దర్శించుకున్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా అయోధ్యలో రామమందిరానికి చేరుకుని రాముడ్ని దర్శించుకున్నారు. పండితులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు మూడో దశకు చేరుకున్నాయి. మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన అయోధ్య రాముడ్ని మోడీ దర్శించుకున్నారు. ప్రధాని మోడీ.. విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేశారు. జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించారు.
ఇది కూడా చదవండి: KL Sharma: అమేథీలో స్మృతి ఇరానీని ఓడించి తీరుతా
Also Read
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
ఆలయ ప్రవేశ ద్వారాలు పసుపు రేకులతో ఏర్పాటు చేసిన ‘ఓం’ పూలతో అలంకరించబడ్డాయి. పూలతో తయారు చేసిన విల్లు మరియు బాణం యొక్క ప్రతిరూపాలు కూడా వివిధ ప్రదేశాలలో కనిపించాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రకారం.. ఆలయంలో కూర్చున్న రామ్ లల్లా ఆదివారం లేత గులాబీ రంగు దుస్తులు ధరించారు.
ఇది కూడా చదవండి: Israel: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
అయోధ్య జిల్లా పరిధిలోకి వచ్చే ఫైజాబాద్ లోక్సభ స్థానానికి మే 20న ఐదవ దశ ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది. ఆలయ సందర్శన అనంతరం ప్రధాన మంత్రి మెగా రోడ్షో నిర్వహించారు. ప్రధాని వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ ఫైజాబాద్ అభ్యర్థి లల్లూ సింగ్ ఆయన వెంట ఉన్నారు. ప్రధాని వాహన శ్రేణి వెళ్లడంతో రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. చీర కట్టుకున్న మహిళల బృందం ప్రధాని వాహనం ముందు నడిచింది. ఆలయ ప్రవేశ ద్వారం నుంచి ప్రారంభమైన రోడ్షో రెండు కిలోమీటర్ల దూరంలోని నయా ఘాట్ రోడ్ క్రాసింగ్ వద్ద ముగిసినట్లు పార్టీ అధికారులు తెలిపారు.
తోటి భారతీయుల క్షేమం కోసం అయోధ్య రాముడ్ని ప్రార్థించినట్లు మోడీ ట్వీట్ చేశారు. 140 కోట్ల మంది భారతీయులు క్షేమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
At Ayodhya, prayed to Prabhu Shri Ram for the well being of my fellow 140 crore Indians. pic.twitter.com/ulwNmktZ2e
— Narendra Modi (@narendramodi) May 5, 2024
తాజావార్తలు
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!