PM Modi: రోమ్లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi in Italy: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఐదు దేశాల పర్యటనలో చివరి దశగా ఇటలీ రాజధాని రోమ్ కు చేరుకున్నారు. మే 19 (భారత కాలమానం ప్రకారం) ఆయన ఇటలీకి చేరుకోగా, ఈ పర్యటన మే 20 వరకు కొనసాగనుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ఇటలీ పర్యటనకు ముందు ప్రధాని మోదీ నార్వేలో జరిగిన 3వ ఇండియా-నార్డిక్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్వేతో పాటు ఇతర నార్డిక్ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు సమావేశాలు, చర్చలు నిర్వహించారు.
ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లా (Sergio Mattarella)ను కలవనున్నారు. అలాగే ప్రధాని జార్జియా మెలోనితో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. గతంలో 2024 జూన్లో జరిగిన జీ7 సమ్మిట్లో పాల్గొనేందుకు కూడా ప్రధాని మోదీ ఇటలీకి వెళ్లిన విషయం తెలిసిందే. భారత్-ఇటలీ సంబంధాలు ఈ మధ్య కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా “జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029” కింద వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, స్వచ్ఛ ఇంధనం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణలు, ప్రజల మధ్య సంబంధాల వంటి కీలక రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా బాగా బలపడ్డాయి. 2025లో భారత్-ఇటలీ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 16.77 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే 2000 ఏప్రిల్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు భారత్లో ఇటలీ పెట్టుబడులు 3.66 బిలియన్ డాలర్లకు చేరినట్లు సమాచారం. ఈ పర్యటన ద్వారా భారత్-ఇటలీ మధ్య ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడటంతో పాటు.. కొత్త పెట్టుబడులు, వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..