Meghalaya Elections: షిల్లాంగ్లో ప్రధాని మోదీ రోడ్షో.. భద్రత కట్టుదిట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meghalaya Elections: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం షిల్లాంగ్లో రోడ్షో నిర్వహించారు. సెంట్రల్ లైబ్రరీ వద్ద ప్రారంభమైన రోడ్షో పోలీసు బజార్లో ముగిసింది. అక్కడ బహిరంగ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధానమంత్రి వాహనం వెళ్లే రహదారికి ఇరువైపులా ప్రజలు క్యూలు కట్టడంతో రోడ్షోకు భారీ స్పందన లభించింది. ప్రధాని కూడా ప్రజలకు అభివాదం చేస్తూ వారి వైపు చేతులు ఊపుతూ కనిపించారు. షిల్లాంగ్లో రాష్ట్రంలోని ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులు యు తిరోట్ సింగ్, యు కియాంగ్ నంగ్బా, ప టోగన్ సంగ్మా చిత్రపటాలకు కూడా ప్రధాని మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు షిల్లాంగ్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
షిల్లాంగ్లోని రోడ్షో నేపథ్యంలో పోలీస్ బజార్ పాయింట్లో మేఘాలయ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో సహా 1,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. షిల్లాంగ్లో ప్రధానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని.. నగరంలో 1000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించినట్లు షిల్లాంగ్లోని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పవార్ స్వప్నిల్ వసంతరావు తెలిపారు. అనంతరం శుక్రవారం గారో హిల్స్లోని తురాలోని అలోత్గ్రే స్టేడియంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
Also Read
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
- రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
Read Also: Gujarat Budget: గుజరాత్ బడ్జెట్ రూ.3.01 లక్షల కోట్లు.. ఆరోగ్య బీమా రెట్టింపు
ముఖ్యంగా, తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని ర్యాలీకి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గతంలో అనుమతి కోరింది. పీఏ సంగ్మా స్టేడియంలో ర్యాలీని నిర్వహించడానికి నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ప్రభుత్వం స్టేడియం నిర్మాణంలో ఉందని అనుమతికి నిరాకరించిందని బీజేపీ పేర్కొంది. అనంతరం ప్రధానమంత్రి ర్యాలీకి ప్రత్యామ్నాయ ఏర్పాటుగా తురాలోని అలోత్గ్రే స్టేడియం కోసం పార్టీ అనుమతి పొందింది. ఈసారి మొత్తం 60 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనుండగా, మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?