Meghalaya Elections: షిల్లాంగ్లో ప్రధాని మోదీ రోడ్షో.. భద్రత కట్టుదిట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meghalaya Elections: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం షిల్లాంగ్లో రోడ్షో నిర్వహించారు. సెంట్రల్ లైబ్రరీ వద్ద ప్రారంభమైన రోడ్షో పోలీసు బజార్లో ముగిసింది. అక్కడ బహిరంగ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధానమంత్రి వాహనం వెళ్లే రహదారికి ఇరువైపులా ప్రజలు క్యూలు కట్టడంతో రోడ్షోకు భారీ స్పందన లభించింది. ప్రధాని కూడా ప్రజలకు అభివాదం చేస్తూ వారి వైపు చేతులు ఊపుతూ కనిపించారు. షిల్లాంగ్లో రాష్ట్రంలోని ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులు యు తిరోట్ సింగ్, యు కియాంగ్ నంగ్బా, ప టోగన్ సంగ్మా చిత్రపటాలకు కూడా ప్రధాని మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు షిల్లాంగ్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
షిల్లాంగ్లోని రోడ్షో నేపథ్యంలో పోలీస్ బజార్ పాయింట్లో మేఘాలయ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో సహా 1,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. షిల్లాంగ్లో ప్రధానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని.. నగరంలో 1000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించినట్లు షిల్లాంగ్లోని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పవార్ స్వప్నిల్ వసంతరావు తెలిపారు. అనంతరం శుక్రవారం గారో హిల్స్లోని తురాలోని అలోత్గ్రే స్టేడియంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
Read Also: Gujarat Budget: గుజరాత్ బడ్జెట్ రూ.3.01 లక్షల కోట్లు.. ఆరోగ్య బీమా రెట్టింపు
ముఖ్యంగా, తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని ర్యాలీకి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గతంలో అనుమతి కోరింది. పీఏ సంగ్మా స్టేడియంలో ర్యాలీని నిర్వహించడానికి నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ప్రభుత్వం స్టేడియం నిర్మాణంలో ఉందని అనుమతికి నిరాకరించిందని బీజేపీ పేర్కొంది. అనంతరం ప్రధానమంత్రి ర్యాలీకి ప్రత్యామ్నాయ ఏర్పాటుగా తురాలోని అలోత్గ్రే స్టేడియం కోసం పార్టీ అనుమతి పొందింది. ఈసారి మొత్తం 60 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనుండగా, మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!