Gujarat Budget: గుజరాత్ బడ్జెట్ రూ.3.01 లక్షల కోట్లు.. ఆరోగ్య బీమా రెట్టింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Budget: గుజరాత్ ఆర్థిక మంత్రి కను దేశాయ్ శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని కొత్త భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వానికి ఇది మొదటి బడ్జెట్. గుజరాత్ ఆర్థిక శాఖ రాష్ట్రానికి సంబంధించి రూ.3.01 లక్షల కోట్ల బడ్జెట్ను సమర్పించింది. ఇది గత ఏడాది కంటే 23.38 శాతం ఎక్కువ. ఈ బడ్జెట్లో పౌరులపై ఎలాంటి కొత్త పన్నులు విధించలేదు. ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య-ఎంఏ (పీఎంజేవై-ఎంఎ) పథకం కింద బీమా కవరేజీని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు రెట్టింపు చేసి, ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ప్రకటించింది.
Read Also: Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ ఎన్నికలు వద్దంటూ తీర్మానం
Also Read
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
గుజరాత్ బడ్జెట్లోని ముఖ్యాంశాలు
*మూలధన ఖాతా, నికర పబ్లిక్ ఖాతాతో కూడిన రెవెన్యూ ఖాతాను పరిగణనలోకి తీసుకుంటే, 2023-24 ఆర్థిక సంవత్సరానికి అంచనాలు రూ. 916.87 కోట్ల మిగులును చూపుతాయని గుజరాత్ ఆర్థిక శాఖ మంత్రి కను దేశాయ్ చెప్పారు.
*రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)ని రూ.42 లక్షల కోట్లకు మించి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ప్రకటించారు.
*ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య-ఎంఏ పథకం కింద వార్షిక బీమా పరిమితి అర్హత ఉన్న కుటుంబాలకు రూ.10 లక్షలకు రెట్టింపు చేయబడుతుంది.
*రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు దాదాపు రూ.5 లక్షల కోట్లు వెచ్చించనుందని తెలిపారు.
*1,500 కోట్ల పెట్టుబడితో ఐదు రాష్ట్ర రహదారులను హైస్పీడ్ కారిడార్లుగా అభివృద్ధి చేయనున్నారు.
*అహ్మదాబాద్-బగోదర-రాజ్కోట్ హైవే 6 లేన్లుగా మారుతుందని మంత్రి తెలిపారు.
*పాత వంతెనల పునర్నిర్మాణం, పటిష్టత కోసం రూ.550 కోట్లు కేటాయించారు.
*రాష్ట్రంలోని ప్రతి జిల్లా, తాలూకాలో క్రీడా సముదాయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
*వచ్చే ఏడాదిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద సుమారు 1 లక్ష మందికి ఇళ్లను అందించడానికి రూ.1,066 కోట్లు ఖర్చు చేయనున్నారు.
*రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రోత్సహించేందుకు గుజరాత్ ఎఫ్ఎం దేశాయ్ రూ.34,884 కోట్లు ప్రకటించారు.
*రాష్ట్ర జలవనరుల శాఖకు రూ.9,705 కోట్లు కేటాయించారు.
*11 లక్షల మంది జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం లబ్ధిదారులకు నెలవారీ పెన్షన్ కోసం 1,340 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ ప్రకటించింది.
*నర్మదా ప్రధాన కాలువ నిర్వహణకు రూ.178 కోట్లు ప్రకటించారు.
*నర్మదా ప్రాజెక్టుకు రూ.5,950 కోట్లు ప్రకటించారు, అందులో కుత్బుల్లాపూర్ బ్రాంచ్ కెనాల్కు సంబంధించి మిగిలిన పనులకు రూ.1,082 కోట్లు కేటాయించారు.
*పీఎం గతి శక్తి కింద, అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు రూ. 200 కోట్ల ఈక్విటీ సహకారం ప్రకటించారు.
*ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మద్దతుతో గిఫ్ట్ సిటీలో ఫిన్టెక్ హబ్ ఏర్పాటు చేయబడుతుంది. గిఫ్ట్ సిటీకి రూ.76 కోట్లు, గిఫ్ట్ సిటీ సమీపంలోని సబర్మతి రివర్ ఫ్రంట్ కోసం రూ.150 కోట్లు ప్రతిపాదించారు.
తాజావార్తలు
-
AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
ట్రెండింగ్
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!