Gujarat Budget: గుజరాత్ బడ్జెట్ రూ.3.01 లక్షల కోట్లు.. ఆరోగ్య బీమా రెట్టింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Budget: గుజరాత్ ఆర్థిక మంత్రి కను దేశాయ్ శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని కొత్త భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వానికి ఇది మొదటి బడ్జెట్. గుజరాత్ ఆర్థిక శాఖ రాష్ట్రానికి సంబంధించి రూ.3.01 లక్షల కోట్ల బడ్జెట్ను సమర్పించింది. ఇది గత ఏడాది కంటే 23.38 శాతం ఎక్కువ. ఈ బడ్జెట్లో పౌరులపై ఎలాంటి కొత్త పన్నులు విధించలేదు. ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య-ఎంఏ (పీఎంజేవై-ఎంఎ) పథకం కింద బీమా కవరేజీని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు రెట్టింపు చేసి, ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ప్రకటించింది.
Read Also: Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ ఎన్నికలు వద్దంటూ తీర్మానం
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
గుజరాత్ బడ్జెట్లోని ముఖ్యాంశాలు
*మూలధన ఖాతా, నికర పబ్లిక్ ఖాతాతో కూడిన రెవెన్యూ ఖాతాను పరిగణనలోకి తీసుకుంటే, 2023-24 ఆర్థిక సంవత్సరానికి అంచనాలు రూ. 916.87 కోట్ల మిగులును చూపుతాయని గుజరాత్ ఆర్థిక శాఖ మంత్రి కను దేశాయ్ చెప్పారు.
*రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)ని రూ.42 లక్షల కోట్లకు మించి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ప్రకటించారు.
*ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య-ఎంఏ పథకం కింద వార్షిక బీమా పరిమితి అర్హత ఉన్న కుటుంబాలకు రూ.10 లక్షలకు రెట్టింపు చేయబడుతుంది.
*రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు దాదాపు రూ.5 లక్షల కోట్లు వెచ్చించనుందని తెలిపారు.
*1,500 కోట్ల పెట్టుబడితో ఐదు రాష్ట్ర రహదారులను హైస్పీడ్ కారిడార్లుగా అభివృద్ధి చేయనున్నారు.
*అహ్మదాబాద్-బగోదర-రాజ్కోట్ హైవే 6 లేన్లుగా మారుతుందని మంత్రి తెలిపారు.
*పాత వంతెనల పునర్నిర్మాణం, పటిష్టత కోసం రూ.550 కోట్లు కేటాయించారు.
*రాష్ట్రంలోని ప్రతి జిల్లా, తాలూకాలో క్రీడా సముదాయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
*వచ్చే ఏడాదిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద సుమారు 1 లక్ష మందికి ఇళ్లను అందించడానికి రూ.1,066 కోట్లు ఖర్చు చేయనున్నారు.
*రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రోత్సహించేందుకు గుజరాత్ ఎఫ్ఎం దేశాయ్ రూ.34,884 కోట్లు ప్రకటించారు.
*రాష్ట్ర జలవనరుల శాఖకు రూ.9,705 కోట్లు కేటాయించారు.
*11 లక్షల మంది జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం లబ్ధిదారులకు నెలవారీ పెన్షన్ కోసం 1,340 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ ప్రకటించింది.
*నర్మదా ప్రధాన కాలువ నిర్వహణకు రూ.178 కోట్లు ప్రకటించారు.
*నర్మదా ప్రాజెక్టుకు రూ.5,950 కోట్లు ప్రకటించారు, అందులో కుత్బుల్లాపూర్ బ్రాంచ్ కెనాల్కు సంబంధించి మిగిలిన పనులకు రూ.1,082 కోట్లు కేటాయించారు.
*పీఎం గతి శక్తి కింద, అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు రూ. 200 కోట్ల ఈక్విటీ సహకారం ప్రకటించారు.
*ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మద్దతుతో గిఫ్ట్ సిటీలో ఫిన్టెక్ హబ్ ఏర్పాటు చేయబడుతుంది. గిఫ్ట్ సిటీకి రూ.76 కోట్లు, గిఫ్ట్ సిటీ సమీపంలోని సబర్మతి రివర్ ఫ్రంట్ కోసం రూ.150 కోట్లు ప్రతిపాదించారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!