PM Modi: తమిళనాడు టూర్లో బాంబు బెదిరింపు.. భద్రత కట్టుదిట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్డీఏకి 400 సీట్లు ఇవ్వాలని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగియగానే తమిళనాడు కోయంబత్తూర్లో మోడీ భారీ రోడ్ షో నిర్వహించారు.
అయితే మోడీ రోడ్ షో నేపథ్యంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు కోయంబత్తూర్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వాస్తవానికి తొలుత మోడీ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అనంతరం మద్రాస్ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో మోడీ భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు.
Also Read
ప్రధాని నరేంద్ర మోడీ కోయంబత్తూరు పర్యటనకు కొన్ని గంటల ముందే బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో భారీ భద్రత మధ్య కోయంబత్తూరులో రోడ్షో నిర్వహించారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో కూడా ఐదు అంచెల భద్రతను అమలు చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ , కోయంబత్తూర్ సిటీ పోలీస్ మరియు అనేక ఇతర విభాగాల సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీల తర్వాత మోడీ రోడ్ షో నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Tillu Square: ఉన్నది పాయే .. ఉంచుకున్నది పాయే.. లిల్లీతో ఏందీ లొల్లి.. టిల్లు
నగరంలోని మెట్టుపాళయం దగ్గర ప్రారంభమైన మోడీ రోడ్ షో.. ఆర్ఎస్ పురం దగ్గర ముగియనుంది. అనంతరం కన్యాకుమారిలో జరగనున్న సభలో మోడీ మాట్లాడనున్నారు.గత శనివారమే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న పోలింగ్ ప్రారంభమై జూన్ 1న ముగియనుంది. జూన్ 4న ఫలితాలు విడుదలకానున్నాయి.
ఇదిలా ఉంటే ఈసారి ప్రధాని మోడీ దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. మోడీ ఎక్కువ సార్లు ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఎక్కువగా పర్యటిస్తున్నారు. సౌతిండియాలో బీజేపీకి మొదటి నుంచి బలం తక్కువగా ఉంటుంది. అందుకోసమే ఈసారి మోడీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Japan Earthquake: జపాన్లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
-
Anirudh : అనిరుథ్ – కావ్య మారన్ పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ మెంబర్
-
IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!