Ladakh 5New Districts : లడఖ్లో ఐదు కొత్త జిల్లాలు.. కేంద్ర ప్రభుత్వ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ladakh 5New Districts : కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల లడఖ్ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. లడఖ్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని షా అన్నారు. లడఖ్లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని షా ట్వీట్ చేశారు. లడఖ్ను అభివృద్ధి చేసి సంపన్నంగా మార్చాలనే ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాల్లో జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ ఉన్నాయి.
గతంలో రెండు.. ఇప్పుడు 7 జిల్లాలు
2019 సంవత్సరంలో లడఖ్ను జమ్మూ కాశ్మీర్ నుండి వేరు చేసి, కొత్త కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. ఆ సమయంలో కేంద్రపాలిత ప్రాంతంలో కేవలం రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి – లేహ్, కార్గిల్. ఇప్పుడు లడఖ్లో మరో ఐదు కొత్త జిల్లాలు (జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తంగ్) ఏర్పడ్డాయి.
Also Read
- Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
- Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే 'పచ్చిమిర్చి ఆవకాయ'.! తింటే వావ్ అనాల్సిందే..
- టెస్లా లవర్స్కి గుడ్ న్యూస్.. రూ.9 లక్షల తగ్గింపుతో మార్కెట్లోకి సరికొత్త Tesla Model Y మోడల్.. ఫీచర్స్ అదుర్స్!!
- Supreme Court: సె*క్స్ వర్కర్ల హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చారిత్రాత్మక మార్గదర్శకాలు..
Read Also:Mahesh Babu: సింహంలా గర్జించిన మహేశ్ బాబు ‘ముఫాసా’ ట్రైలర్ రిలీజ్..
ప్రధాని మోదీ మంచి అడుగు
లడఖ్లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు మెరుగైన పాలన, శ్రేయస్సు కోసం ఒక అడుగు అని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలకు సేవలు , అవకాశాలను మరింత చేరువ చేసేందుకు జంస్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తంగ్లపై ఇప్పుడు మరింత దృష్టి కేంద్రీకరించవచ్చు. అక్కడి ప్రజలకు అభినందనలు అంటూ షా ట్విటర్లో రాసుకొచ్చారు.
2019లో కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్
1979లో లడఖ్ను కార్గిల్ మరియు లేహ్ జిల్లాలుగా విభజించారు. 1989లో బౌద్ధులు, ముస్లింల మధ్య అల్లర్లు జరిగాయి. 1990లలోనే, లడఖ్ను కాశ్మీరీ పాలన నుండి విముక్తి చేయడానికి లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పడింది. 5 ఆగస్టు 2019న ఇది కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. భారతదేశంలో అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో లడఖ్ ఒకటి.
Read Also:Ukrain Attack : రష్యాలో 9/11 తరహా దాడి.. సరతోవ్లోని ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన డ్రోన్
చైనా-పాక్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న లడఖ్
చైనా మరియు పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న లడఖ్ వ్యూహాత్మక, రక్షణ దృక్కోణం నుండి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. లడఖ్ తూర్పున టిబెట్, దక్షిణాన లాహౌల్, స్పితి, పశ్చిమాన జమ్మూ కాశ్మీర్, బాల్టిస్తాన్.. ఉత్తరాన జిన్జియాంగ్లోని ట్రాన్స్ కున్లున్ ప్రాంతం సరిహద్దులుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
-
Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!
-
Naga Chaitanya : ఢిల్లీ హైకోర్టులో అక్కినేని నాగచైతన్యకు ఊరట
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
టెస్లా లవర్స్కి గుడ్ న్యూస్.. రూ.9 లక్షల తగ్గింపుతో మార్కెట్లోకి సరికొత్త Tesla Model Y మోడల్.. ఫీచర్స్ అదుర్స్!!
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!