Chevella Road Accident: మృత్యు ఘోష.. ప్రధాని దిగ్భ్రాంతి..! మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chevella Road Accident: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని పేర్కొంటూ, ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాల పట్ల తన సానుభూతిని ప్రకటించారు ప్రధాని మోడీ. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. తక్షణమే మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, అలాగే గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున నష్టపరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు.
Shafali-Deepthi: అటు బ్యాట్తో.. ఇటు బంతితో.. త్రూ ఛాంపియన్స్ వారిద్దరే..!
Also Read
- INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దీని వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ తెలుపుతూ.. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక కుటుంబాలకు 5 లక్షలు.. అలాగే ఆర్టీసీ తరఫున రెండు లక్షల రూపాయలు మొత్తం కలిపి 7 లక్షల రూపాయలు మృతుల కుటుంబాలకు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు అధికారులు ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 11 మందిని గుర్తించారు. మృతుల్లో ఏనుగుల కల్పన, బి. నాగమణి, హనుమంతు, గుర్రాల అబిత, గోసల గుణమ్మ, షేక్ ఖలీద్ జహంగీర్ ఉన్నారు. ఇందులో తనుషా, సాయిప్రియ, నందిని అనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతి చెందిన వీరంతా తాండూరులోని వడ్డెర గల్లికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
Chevella: చేవెళ్లలో బస్సు ప్రమాదం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర దిగ్భ్రాంతి
తాజావార్తలు
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!