Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pm Modi Calls For Diplomatic Solution To Ukraine War In G20 Summit

PM Narendra Modi: జీ20 వేదికగా పీఎం మోడీ సుదీర్ఘ ప్రసంగం.. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు పిలుపు

NTV Telugu Twitter
Published Date :November 15, 2022 , 1:03 pm
By Mahesh Jakki
PM Narendra Modi: జీ20 వేదికగా పీఎం మోడీ సుదీర్ఘ ప్రసంగం.. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు పిలుపు
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Narendra Modi: ఇండోనేషియాలోని బాలిలో ఓ ప్రముఖ హోటల్‌ వేదికగా నిర్వహించిన జీ20 దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కొవిడ్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితులు సహా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గాన్ని కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ సూచించారు. రెండో ప్రపంచ యుద్ధంలో శాంతిని నెలకొల్పేందుకు అప్పటి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారని మరోసారి అలాంటి ప్రయత్నాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇండోనేషియాలోని బాలీలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సహా దేశాధినేతల సమక్షంలో జీ20 శిఖరాగ్ర సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది. సదస్సు ప్రారంభం సందర్భంగా బైడెన్‌ను ఆలింగనం చేసుకున్న మోదీ కొద్దిసేపు ఆయనతో ఏకాంతంగా మాట్లాడారు.

ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ, దౌత్య మార్గాన్ని తిరిగి తీసుకురావడానికి మనమంతా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. గత శతాబ్దంలో రెండో ప్రపంచ యుద్ధం.. ప్రపంచంలో పెను విధ్వంసం సృష్టించింది. ఆ తర్వాత శాంతిని నెలకొల్పేందుకు అప్పటి ప్రపంచ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారన్నారు. వాతావరణ మార్పు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్‌లో పరిణామాలు, వీటితో ముడిపడి ఉన్న ప్రపంచ సమస్యలు. ఇవన్నీ కలిపి ప్రపంచ వినాశనానికి కారణమయ్యాయి. దీంతో ప్రపంచలోని సరఫరా వ్యవస్థలో సంబంధాలు తెగిపోయాయన్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సంక్షోభం ఉందని ఆయన చెప్పారు. అందుకే మనమంతా ఏకమవ్వాలని దేశాధినేతలకు ప్రధాని పిలుపునిచ్చారు.

అనంతరం ఆహారం, ఇంధనంపై జరిగిన సదస్సులో ప్రసంగించిన మోదీ కరోనా సంక్షోభం తర్వాత కొత్త ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత మనందరి భుజాలపై ఉందని దేశాధినేతలకు పిలుపునిచ్చారు. ప్రపంచ రవాణా గొలుసు వ్యవస్థ శిథిలావస్థలో ఉందని నిత్యావసర వస్తువుల సంక్షోభం ప్రతి దేశంలో సవాలు విసురుతుందన్నారు. వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్‌ పరిణామాలు ప్రపంచంలో విధ్వంసం సృష్టించాయని.. వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

Shraddha Case: కేసులో షాకింగ్ ట్విస్టులు.. ఫ్రిజ్‌లో శవం పెట్టి, మరో యువతితో రొమాన్స్

ఉక్రెయిన్‌ -రష్యాల మధ్య యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ దేశ చమురు, గ్యాస్ సేకరణకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఇంధన సరఫరాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని ప్రధాని పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధనంతో పాటు పర్యావరణానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. సవాళ్లతో కూడిన జీ 20 సదస్సుకు నాయకత్వం వహించినందుకు ఇండోనేషియాను ప్రధాని మోడీ అభినందించారు. 2030 నాటికి భారత్​లో సరఫరా అయ్యే విద్యుత్తులో సగం పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేయనున్నామని తెలిపారు. ఈ సదస్సు ముగింపు వేడుకల్లో ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో భారత్‌కు జీ-20 అధ్యక్ష పగ్గాలను ప్రధాని మోడీకి అప్పగించనున్నారు. వచ్చే ఏడాది మన దేశంలో జరగనున్న ఆ కూటమి సదస్సుకు హాజరవ్వాల్సిందిగా సభ్యదేశాల నేతలను నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా ఆహ్వానించనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • china
  • climate change
  • G20 Summit
  • india

తాజావార్తలు

  • Mani Ratnam : అభిమానులకు క్షమాపణలు చెప్పిన మణిరత్నం..

  • Polavaram Project: రెండోరోజు పోలవరం నిర్వాసితుల నిరసన దీక్ష.. పునరావాసం, నష్టపరిహారం డిమాండ్!

  • Netanyahu: ఇరాన్‌తో కాల్పుల విరమణపై నెతన్యాహు కీలక ప్రకటన

  • VIVO T4 Lite 5G: రూ.9,999 లకే ఇంత పవర్‌ఫుల్ ఫోన్ మరోటి ఉండదేమో.. వివో T4 లైట్ 5G మొబైల్ లాంచ్..!

  • Vijay Varma : దంగల్ భామతో తమన్నా మాజీ లవర్ ప్రేమరసం

ట్రెండింగ్‌

  • Vitamin D Foods: మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ D ఎలా తోడ్పడుతుందంటే..?

  • BSNL Launches Quantum 5G FWA: 5G విప్లవానికి నాంది.. బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G FWA సేవలు రూ.999 నుంచే ప్రారంభం..!

  • boAt Airdopes Prime 701 ANC: 50 గంటల ప్లేబ్యాక్‌, 46dB నాయిస్ క్యాన్సిలేషన్ తో వచ్చేసిన కొత్త ఇయర్‌బడ్స్..!

  • OPPO K13x 5G: అసలు మిస్ అవ్వద్దు.. కేవలం రూ. 11,999లకే 6000mAh భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఫీచర్లతోపాటు మరెన్నో ..

  • Xiaomi Mix Flip 2: 6.85 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 50MP + 50MP కెమెరాలతో విడుదలకు సిద్దమైన షియోమీ మిక్స్ ఫ్లిప్ 2..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions