Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్ భేటీలో పాలనా సంస్కరణలు, పరిపాలనా సామర్థ్యం, ‘వికసిత్ భారత్ 2047’ దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు ప్రస్తుత పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) సంక్షోభం వల్ల తలెత్తే పరిణామాలపై లోతుగా చర్చించారు. ‘సేవా తీర్థ్’ వేదికగా సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి కేంద్ర కేబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యతలు గల సహాయ మంత్రులు, సహాయ మంత్రులందరూ హాజరయ్యారు. ఈ ఏడాదిలో పూర్తి స్థాయి మంత్రిమండలి భేటీ కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావస్తున్న తరుణంలో.. ప్రభుత్వ పనితీరును బేరీజు వేసే ఒక ‘మిడ్టర్మ్ రివ్యూ’ (మధ్యంతర సమీక్ష) లాగా ఈ సెషన్ సాగింది.
సమావేశంలో తొమ్మిది కంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలు తమ పనితీరు, భవిష్యత్తు కార్యాచరణపై సవివరమైన ప్రెజెంటేషన్లు ఇచ్చాయి. కేబినెట్ సెక్రటరీ, నీతి ఆయోగ్ సైతం కీలకమైన ప్రెజెంటేషన్లను సమర్పించాయి. ఫైళ్లను అత్యంత వేగంగా పరిష్కరిస్తూ, నిర్ణయాలను సకాలంలో అమలు చేయడంలో ముందున్న శాఖలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఇదే సమయంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. ప్రధాని మోడీ ఇటీవలి ఐదు దేశాల పర్యటన, దానివల్ల చేకూరిన దౌత్యపరమైన ప్రయోజనాలను మంత్రిమండలికి వివరించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం గురించి ప్రస్తావించిన ప్రధాని మోడీ.. దీనివల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలను ఆదేశించారు. ముఖ్యంగా ఇంధనం, వ్యవసాయం, ఎరువులు, విమానయానం, షిప్పింగ్, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాలపై ఈ భేటీలో ప్రత్యేక దృష్టి పెట్టారు. నిజానికి పశ్చిమాసియా పరిస్థితులను పర్యవేక్షించడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి అనధికారిక మంత్రుల బృందం పని చేస్తోంది. అయితే రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనలో ఉండటం వల్ల, అలాగే ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా జెనీవాలో ఉండటం వల్ల వారు ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు.
Also Read
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
ఇక ఐదు దేశాల పర్యటనను విజయవంతంగా ముగించుకుని గురువారమే ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీకి ఈ సమావేశంలో ఘన సత్కారం లభించింది. విదేశీ పర్యటన విజయవంతం కావడం, అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినందుకు గానూ మోడీని మంత్రులు అభినందించారు. ఇంధన భద్రత, రక్షణ సహకారం, వాణిజ్యం, కీలక ఖనిజాల సరఫరా వంటి రంగాలలో భారతదేశ భాగస్వామ్యాన్ని విస్తరించడమే లక్ష్యంగా మోడీ యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటించారు. యూఏఈ పర్యటనలో భాగంగా వ్యూహాత్మక చమురు నిల్వలు, దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా, రక్షణ, షిప్పింగ్ రంగాలలో పలు ఒప్పందాలు జరిగాయి. అలాగే అబుదాబి భారతదేశంలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మోడీ జరిపిన ఈ భేటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఐరోపా (యూరప్) దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్తో భారత్ 17 కీలక ఒప్పందాలపై సంతకాలు చేసి, ఇరుదేశాల బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకుంది. అక్కడ కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన స్థిరత్వంపై చర్చలు జరిగాయి. అటు స్వీడన్, నార్వే దేశాలతో కూడా సంబంధాలు మరింత బలపడ్డాయి. క్లీన్ ఎనర్జీ, ఆవిష్కరణలు, రక్షణ, డిజిటల్ టెక్నాలజీలు, కీలక ఖనిజాల రంగాలలో సహకార ఫ్రేమ్వర్క్లను ప్రకటించడంతో పాటు, ‘ఇండియా-నార్డిక్ సమ్మిట్’ ద్వారా విస్తృతమైన చర్చలు జరిగాయి. మోడీ పర్యటన చివరి విడతగా ఇటలీ చేరుకుని, అక్కడ ప్రధాని జార్జియా మెలోనితో జరిపిన చర్చల అనంతరం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచారు. ఈ సుదీర్ఘ అనుభవాలు, విజయాల నేపథ్యాన్ని గుర్తుచేస్తూనే.. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని కేవలం ఒక నినాదంగా కాకుండా, ఒక పవిత్రమైన బాధ్యతగా, నిబద్ధతతో స్వీకరించి పని చేయాలని కేంద్ర మంత్రులందరికీ ప్రధాని మోడీ స్పష్టమైన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
-
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్తోనేనా?
-
Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!