PM Modi: నీట్ పేపర్ వ్యవహారం, సీజేపీ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే, కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పేపర్ లీక్పై కీలక బిల్లును తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ప్రకారం పేపర్ లీక్ కేసుల్లో దోషులుగా తేలిన వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు తీసుకురానున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను పెంచడమే ఈ సవరణ బిల్లు లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది.
ఇదిలా ఉంటే, ఈ కేబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని నరేంద్రమోడీ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రులు సోషల్ మీడియా ప్లాట్ఫారామ్లలో యాక్టివ్గా ఉండాలని సూచించారు. ఇన్స్టాగ్రామ్ ఉపయోగించాలని, కేవలం పోస్టులకు మాత్రమే పరిమితం కాకుండా యువతతో టచ్లో ఉండాలని చెప్పారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని మంత్రులతో అన్నారు. ఓ వైపు సీజేపీ ఆధ్వర్యంలో యువత నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తు్న్న సమయంలో ప్రధాని మోడీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

