PM Modi: అంబేద్కర్ను మేము హృదయంలో పెట్టుకున్నాం.. మీరు పాదాల కింద పెట్టుకున్నారు..!
- బీహార్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
- సివాన్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని
- బీహార్ నుంచి రూ. వేల కోట్ల ప్రాజెక్టులకు పునాది
- ఇవి సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తాయి
- సివాన్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో ఉన్నారు. సివాన్లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది వేశామని ప్రధాని మోడీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయన్నారు. పేదరికాన్ని తగ్గించవచ్చని తాము చూపించామని, ప్రపంచ బ్యాంకు సైతం భారతదేశానికి అభిమానిగా మారిందని మోడీ అన్నారు.
READ MORE: Shekar Kammula : భారీ బడ్జెట్ కాదు.. ప్రేక్షకులు మెచ్చినవే పాన్ ఇండియా మూవీలు..
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
ఇటీవల వైరల్ అవుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిత్రంపై ప్రధాని స్పందించారు. ఆర్జేడీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫొటోను తన పాదాల వద్ద ఉంచుకుంటుందని, కానీ మోడీ మాత్రం అంబేద్కర్ను తన హృదయంలో ఉంచుకున్నానన్నారు. “మేము సబ్కా సాథ్, సబ్కా వికాస్ అని అంటాం, కానీ మన ప్రతిపక్షాలు పరివార్ కా సాథ్, పరివార్ కా వికాస్ అని అంటారు. ఇటీవలే బాబా సాహెబ్ చిత్రాన్ని అవమానించారు. ఆ చిత్రాన్ని నేను చూశాను. ప్రజలు క్షమాపణ చెప్పమని అడిగారు. కానీ ఆయన ఎప్పటికీ క్షమాపణ చెప్పరు” మోడీ వ్యాఖ్యానించారు.
READ MORE: PM Modi: దేశాభివృద్ధికి బీహారే కీలకం.. మెగా ప్రాజెక్ట్లు ప్రారంభించిన మోడీ
ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “నేను నిన్ననే విదేశాల నుంచి తిరిగి వచ్చాను. ఈ పర్యటన సందర్భంగా నేను చాలా మంది నాయకులతో మాట్లాడాను. అందరు నాయకులు భారతదేశ అభివృద్ధిని చూసి మెచ్చుకున్నారు. భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుందని వారు భావించారు. ఇందులో బీహార్ చాలా పెద్ద పాత్ర పోషించబోతోంది. పంజా, లాంతరు ఉన్న వ్యక్తులు బీహార్ గౌరవాన్ని దెబ్బతీశారు. ఈ వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. అందుకే బీహార్ పేదరికంలో కూరుకుపోయింది. అనేక సవాళ్లను అధిగమించి.. సీఎం నితీష్ నాయకత్వంలో బీహార్ను తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చాం. నేను బీహార్ ప్రజలకు విశ్వాసం కలిగించడానికి వచ్చాను. ఇప్పటికే బీహార్ ప్రజల కోసం చాలా చేశాను. ఇంకా చాలా చేయాల్సి ఉంది. గత 10-11 సంవత్సరాల్లో 55 వేల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు నిర్మించాం. 1.5 కోట్లకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా అందించాం. 1.5 కోట్ల మందికి నీటి కనెక్షన్ ఇచ్చాం. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.” అని ప్రధాని మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!