PM Modi: అంబేద్కర్ను మేము హృదయంలో పెట్టుకున్నాం.. మీరు పాదాల కింద పెట్టుకున్నారు..!
- బీహార్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
- సివాన్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని
- బీహార్ నుంచి రూ. వేల కోట్ల ప్రాజెక్టులకు పునాది
- ఇవి సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తాయి
- సివాన్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో ఉన్నారు. సివాన్లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది వేశామని ప్రధాని మోడీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయన్నారు. పేదరికాన్ని తగ్గించవచ్చని తాము చూపించామని, ప్రపంచ బ్యాంకు సైతం భారతదేశానికి అభిమానిగా మారిందని మోడీ అన్నారు.
READ MORE: Shekar Kammula : భారీ బడ్జెట్ కాదు.. ప్రేక్షకులు మెచ్చినవే పాన్ ఇండియా మూవీలు..
Also Read
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
ఇటీవల వైరల్ అవుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిత్రంపై ప్రధాని స్పందించారు. ఆర్జేడీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫొటోను తన పాదాల వద్ద ఉంచుకుంటుందని, కానీ మోడీ మాత్రం అంబేద్కర్ను తన హృదయంలో ఉంచుకున్నానన్నారు. “మేము సబ్కా సాథ్, సబ్కా వికాస్ అని అంటాం, కానీ మన ప్రతిపక్షాలు పరివార్ కా సాథ్, పరివార్ కా వికాస్ అని అంటారు. ఇటీవలే బాబా సాహెబ్ చిత్రాన్ని అవమానించారు. ఆ చిత్రాన్ని నేను చూశాను. ప్రజలు క్షమాపణ చెప్పమని అడిగారు. కానీ ఆయన ఎప్పటికీ క్షమాపణ చెప్పరు” మోడీ వ్యాఖ్యానించారు.
READ MORE: PM Modi: దేశాభివృద్ధికి బీహారే కీలకం.. మెగా ప్రాజెక్ట్లు ప్రారంభించిన మోడీ
ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “నేను నిన్ననే విదేశాల నుంచి తిరిగి వచ్చాను. ఈ పర్యటన సందర్భంగా నేను చాలా మంది నాయకులతో మాట్లాడాను. అందరు నాయకులు భారతదేశ అభివృద్ధిని చూసి మెచ్చుకున్నారు. భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుందని వారు భావించారు. ఇందులో బీహార్ చాలా పెద్ద పాత్ర పోషించబోతోంది. పంజా, లాంతరు ఉన్న వ్యక్తులు బీహార్ గౌరవాన్ని దెబ్బతీశారు. ఈ వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. అందుకే బీహార్ పేదరికంలో కూరుకుపోయింది. అనేక సవాళ్లను అధిగమించి.. సీఎం నితీష్ నాయకత్వంలో బీహార్ను తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చాం. నేను బీహార్ ప్రజలకు విశ్వాసం కలిగించడానికి వచ్చాను. ఇప్పటికే బీహార్ ప్రజల కోసం చాలా చేశాను. ఇంకా చాలా చేయాల్సి ఉంది. గత 10-11 సంవత్సరాల్లో 55 వేల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు నిర్మించాం. 1.5 కోట్లకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా అందించాం. 1.5 కోట్ల మందికి నీటి కనెక్షన్ ఇచ్చాం. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.” అని ప్రధాని మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!