Phone : ఫోన్ తీశాడంటూ బావిలో వేలాడదీశారు.. చిన్నారిపై క్రూరత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone: సెల్ ఫోన్ తీశాడంటూ క్రూరంగా చిన్నారిని బావిలో వేలాడదీశాడో వ్యక్తి. తాను దొంగతనం చేయలేదని చెప్తున్నా వినకుండా కనికరం లేకుండా ప్రవర్తించాడు. ఈ ఘటనను ఒకరు వీడియో తీస్తూ మరొకరు బావిలో బాలుడిని వేలాడదీశారు. ఈ దృశ్ం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన మధ్య ప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో జరిగింది. లవ్కుష్నగర్లోని అక్టోహాన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం మొబైల్ దొంగతనం చేశాడని బాలుడిని పట్టుకున్న నిందితుడు.. దారుణంగా కొట్టాడు.
Read Also: Weight Loss : బంపర్ ఆఫర్.. బరువు తగ్గితే రూ.1000కోట్ల బహుమతి
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
అంతటితో ఆగకుండా.. 20 అడుగుల లోతైన బావిలో 5 నిమిషాల పాటు ఒక చేత్తో పట్టుకోని వేలాడదీసాడు. తాను దొంగతనం చేయలేదని వేడుకుంటున్నా కనీసం కనికరించలేదు.. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువకుడు వీడియో తీసి బాధిత చిన్నారి తల్లిదండ్రులకు చూపించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు బాధిత చిన్నారితో కలిసి లవకుష్నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ హేమంత్ నాయక్.. నిందితుడు అజిత్ రాజ్పుత్పై హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
Read Also: Newyork : అమెరికాలో విషాదం.. ట్రెక్కింగ్ చేస్తూ గుంటూరు వాసి మృతి
అయితే.. తాను ఈ దృశ్యాన్ని రికార్డు చేసి బాలుడి తల్లిదండ్రులకు చూపించడంతోనే ఈ ఘటన కలకలం రేపిందని.. లేకపోతే.. ఇంత జరిగేది కాదంటూ ఔట్పోస్టు ఇన్చార్జి ప్రతా దూబే తనను కొట్టారని.. కులం పేరుతో దూషించారని వీడియో తీసిన వ్యక్తి కిషోర్ ఆరోపిస్తున్నాడు. కాగా.. బావిలో 14 అడుగుల మేర నీరు నిండి ఉందని.. నిందితుడు బాలుడిని వదిలేస్తే చనిపోయేవాడని.. బాధిత బాలుడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. వీడియో చూడగానే గుండె తరుక్కుపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా.. దీనిపై ఛతర్ పూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ స్పందించారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని.. పోలీసుల వ్యవహారంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..