IPL 2025 Auction: డబ్బు మ్యాటర్ కాదు.. ఢిల్లీని వీడటంపై స్పందించిన పంత్!
- పంత్ను రిటైన్ చేసుకోని డీసీ
- నవంబర్ 24-25వ తేదీల్లో వేలం
- అందరి దృష్టి పంత్పైనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025కి ముందు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) రిటైన్ చేసుకోని విషయం తెలిసిందే. అక్షర్ పటేల్ (16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (10 కోట్లు), అభిషేక్ పోరెల్ (4 కోట్లు)లను డీసీ రిటైన్ చేసుకుంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. ఈ మెగా వేలంలో అందరి దృష్టి పంత్పైనే ఉంది. అతడికి ధర ఖాయం అని అందరూ అంచనా వేస్తున్నారు. పంజాబ్, బెంగళూరు జట్లు పంత్ను తీసుకోవడానికి భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం.
వేలం నేపథ్యంలో రిషబ్ పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తాజాగా విశ్లేషించాడు. రిటెన్షన్ ఫీజు విషయంలో పంత్ ఢిల్లీ ఫ్రాంఛైజీతో విభేదించి ఉండొచ్చని స్టార్స్పోర్ట్స్ షోలో సన్నీ అన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పంత్ స్పందించాడు. డీసీని వీడటానికి డబ్బుతో ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశాడు. ‘నా రిటెన్షన్ అంశం డబ్బుతో అస్సలు ముడిపడి లేదు. నేను ఈ విషయంను కచ్చితంగా చెప్పగలను’ అని ఆ గవాస్కర్ మాట్లాడిన వీడియోకు కామెంట్ పెట్టాడు.
Also Read
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
Also Read: Team India Fans: కోట్లాది గుండెలు బద్దలైన రోజు.. ‘ఒకే ఒక్కడు’ ఎంతపని చేసే!
సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘మెగా వేలంలో డీసీ కచ్చితంగా రిషబ్ పంత్ను తీసుకుంటుంది. కొన్నిసార్లు ఓ ఆటగాడిని రిటైన్ చేయాలనుకున్నప్పుడు.. ఫీజు గురించి ప్లేయర్, ఫ్రాంఛైజీల మధ్య చర్చ జరుగుతుంది. రిటైన్ అయిన కొంతమందికి ఫ్రాంఛైజీలు మొదటి రిటెన్షన్ కంటే ఎక్కువ డబ్బు చెల్లిస్తారు. వేలంలో పంత్ను ఢిల్లీ పక్కాగా దక్కించుకుంటుంది. ఎందుకంటే డీసీకి కెప్టెన్ అవసరం ఉంది. పంత్ జట్టులో లేకుంటే కొత్త కెప్టెన్ కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. డబ్బు మ్యాటర్ కాదన్న పంత్.. అసలు విషయం మాత్రం చెప్పలేదు.
తాజావార్తలు
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!