Team India Fans: కోట్లాది గుండెలు బద్దలైన రోజు.. ‘ఒకే ఒక్కడు’ ఎంతపని చేసే!
- ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు
- కోట్లాది భారతీయుల గుండెలు బద్దలయ్యాయి
- పరుగుల వరద పారించిన ట్రావిస్ హెడ్
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. కోట్లాది భారతీయుల గుండెలు బద్దలయ్యాయి. ప్రపంచకప్ మనదే అనుకున్న క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా కంటతడి పెట్టారు. బరువెక్కిన హృదయంతో మైదానంను వీడారు. ఇందుకు కారణం వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో భారత్ ఓటమి పాలవ్వడమే. అద్భుతమైన ఆటతో వరుసగా పది మ్యాచ్లు గెలిచి ఫైనల్కు చేరిన భారత్.. తృటిలో కప్ను చేజార్చుకుంది.
2023 నవంబర్ 19న నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 240 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66)లు హాఫ్ సెంచరీలు చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కీలక ప్లేయర్స్ శుభ్మన్ గిల్ (4), శ్రేయస్ అయ్యర్ (4), సూర్యకుమార్ యాదవ్ (18) సహా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (9) తీవ్రంగా నిరాచపర్చారు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్ 3, జోష్ హాజిల్వుడ్2 వికెట్స్ పడగొట్టారు.
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
Also Read: Tecno Pop 9 Launch: ‘టెక్నో పాప్ 9’ వచ్చేస్తోంది.. ధర 10 వేల కంటే తక్కువే!
ఛేదనలో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 43 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ వార్నర్ (7), మిచెల్ మార్ష్ (15), స్టీవ్ స్మిత్ (4) త్వరగా పెవిలియన్ చేరడంతో భారత్ విజయం ఖాయమే అనుకున్నారు. ఈ సమయంలో మార్నస్ లబుషేన్ (58) అండతో ట్రావిస్ హెడ్ (137) జట్టును ఆదుకున్నాడు. క్రీజులో కుదురుకున్నాక బౌండరీలతో రెచ్చిపోయాడు. లబుషేన్ నెమ్మదిగా ఆడగా.. హెడ్ మాత్రం పరుగుల వరద పారించాడు. ఏ భారత బౌలర్ను వదలేదు. ముందుగా ఫిఫ్టీ చేసి ఆస్ట్రేలియాను రేసులోకి తెచ్చిన హెడ్.. ఆపై సెంచరీ చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మూడు వికెట్స్ పడిన సమయంలో హెడ్ కూడా అవుట్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. భారత్ ఓటమి అనంతరం అభిమానులు ఆ రాత్రి నిద్ర కూడా పోలేదు. టీమిండియా క్రీడాభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన ఈ ఫైనల్ మ్యాచ్ జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ‘ఒకే ఒక్కడు ఎంతపని చేసే’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!