Piyush Goyal: మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రపంచం ఇంధన మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. భారత్లోనూ ఇంధన కొరత ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సామాన్యూలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ సామాన్యులకు భారోసా ఇచ్చారు. తమిళనాడలోని తిరుచిరాపల్లిలో కేంద్ర మంత్రి మంగళవారం మాట్లాడారు. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్ మిడిల్ ఈస్ట్ పరిస్థితిని నిరంతరం గమనిస్తోందని..…