Pineapple Ganesh:తిరుపతిలో వెరైటీ… పైనాపిల్ గణేష్ కి భారీ లడ్డూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే అది కలియుగ వైకుంఠం.. టెంపుల్ సిటీ.. నిత్యం అక్కడికి వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. రోజూ కనీసం లక్షమంది వరకూ భక్తులు తిరుపతికి వచ్చి.. ఏడుకొండలపై వెలసిన శ్రీనివాసుడిని దర్శించుకుంటూ వుంటారు. తిరుపతిలో ఈ ఏడాది గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ బాలాజి తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వినాయక చవితిని పురస్కరించుకుని పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని తుమ్మలగుంటలో వినూత్నంగా వినాయకుడిని ఏర్పాటుచేశారు. పైనాపిల్ పండ్లతో భారీ వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. ఈ వినాయకుడికి తాజాగా 1,116 కిలోల భారీ లడ్డూను నైవేద్యంగా పెట్టారు.
పర్యావరణ పరిరక్షణ.. సంస్కృతీ సాంప్రదాయాల ఆచరణకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం.. తుమ్మలగుంటలో 7 వేల పైనాపిల్స్ తో అందంగా రూపొందిన వినాయకుడిని దర్శించుకున్న భక్తుల మనోగతం.. pic.twitter.com/vvx0MpUgAU
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
— Dr. Chevireddy Bhaskar Reddy (@ChevireddyYSRCP) September 3, 2022
వెయ్యి నూట పదహారు కిలోల భారీ లడ్డూను పైనాపిల్ వినాయకుడికి నైవేద్యంగా పెట్టిన వీడియోను చెవిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ భారీ లడ్డూను వేలం వేయబోమని, పైనాపిల్ వినాయకుడి నిమజ్జనంలో పాలుపంచుకునే భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తామని చెవిరెడ్డి తెలిపారు.భారీ పైనాపిల్ గణపతిని దర్శించేందుకు పోటెత్తారు భక్తజనం. తిరుపతి నగరంతో పాటు జిల్లా నలుమూలల నుంచి తరలి వస్తున్న గణపతి భక్తులతో కోలాహలం నెలకొంది. అదే విధంగా తుమ్మలగుంటలో బాల వినాయక ప్రతిమలు భక్తులను మంగళ వాయిద్యాలు వాయిస్తున్న వినాయకుడు చిన్నారులతో పాటు పెద్దల్ని కూడా ఆకట్టుకుంటున్నాయి.
ప్లాస్టిక్ బ్యానర్ రహితంగా జగనన్న తీసుకున్న నిర్ణయం పర్యావరణ హితానికి దోహదం చేస్తుందని చెవిరెడ్డి అన్నారు. పర్యావరణం కోసం లక్షకు పైగా మట్టి వినాయక ప్రతిమల్ని తయారుచేయించి, అందరికీ ఉచితంగా పంచారు చెవిరెడ్డి. చంద్రగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో 1.24 లక్షల మట్టి వినాయక విగ్రహాల తయారీ సాధ్యమైందన్నారు. మరోవైపు తిరుపతిలో నేడు గణేశ్ నిమజ్జనం జరగనుంది. వినాయక సాగర్ లో నిమజ్జనానికి సిద్ధమయ్యాయి వేలాది గణేశ్ విగ్రహాలు.. భారీ పోలీస్ బందోబస్తు…నగరంలో ట్రాఫిక్ మళ్ళింపు చేపట్టారు పోలీసులు.
పర్యావరణ పరిరక్షణ.. సంస్కృతీ సాంప్రదాయాల ఆచరణకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం.. తుమ్మలగుంటలో 7 వేల పైనాపిల్స్ తో అందంగా రూపొందిన వినాయకుడిని దర్శించుకున్న భక్తుల మనోగతం.. pic.twitter.com/vvx0MpUgAU
— Dr. Chevireddy Bhaskar Reddy (@ChevireddyYSRCP) September 3, 2022
తాజావార్తలు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!