African Swine Fever: ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం.. ఒక్కరోజే 85 పందులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
African Swine Fever: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని కట్ని జిల్లాలో ఇప్పటివరకు 85 పందులు చనిపోయాయని, 115 పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు గుర్తించామని సోమవారం ఒక అధికారి తెలిపారు.ఆ ప్రాంతంలో సర్వే నిర్వహించి వ్యాధి సోకిన పందులను ఏరివేసేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. వ్యాధితో పందులు చనిపోయినందుకు పరిహారం మొత్తం కూడా ఇవ్వబడుతుంది.
ఇప్పటి వరకు 85 పందులు చనిపోగా, 115 ఫీవర్ సోకిన పందులను గుర్తించారని వెటర్నరీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్కే సింగ్ వెల్లడించారు. ఈ వ్యాధి సోకిన ప్రదేశం నుంచి కిలోమీటరు వ్యాసార్థం వరకు సోకుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తొమ్మిది కిలోమీటర్ల వ్యాసార్థంలో ఈ వ్యాధి సోకిందని వెల్లడించారు. నాలుగు బృందాలు ఆ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నాయని, రెండు రోజుల్లో సర్వే పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత వ్యాధి సోకిన మండలాల్లో పందులను చంపుతామని, పందుల యజమానులకు కూడా పరిహారం అందజేస్తామని ఆయన తెలిపారు.
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
Sukesh Chandrashekar: ఆప్పై సీబీఐ విచారణ జరిపించాలి.. సుఖేష్ చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు
కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారం అందిందని, పందుల బరువును బట్టి పంపిణీ చేస్తామన్నారు. మొత్తం కనిష్టంగా రూ. 2200, గరిష్టంగా రూ.15,000 మధ్య ఉంటుందని ఆర్కే సింగ్ చెప్పారు. జబల్పూర్ నుంచి నిపుణుల బృందం కూడా రానుంది. సర్వే పూర్తయిన వెంటనే బృందం ఇక్కడికి చేరుకుంటుందని, తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!