Prabhakar Rao-SIT: 8 గంటలు కొనసాగిన విచారణ.. ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం!
- ముగిసిన ప్రభాకర్ రావు సిట్ విచారణ
- 8 గంటలు కొనసాగిన విచారణ
- ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం
- జూన్ 11న మరోసారి విచారణకు ప్రభాకర్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగింది. సిట్ అధికారులు ఆయనను దాదాపు 8 గంటల పాటు విచారించారు. ప్రభాకర్ రావుపై డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేటి విచారణ ముగియగా.. జూన్ 11న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు సిట్ అధికారులు సూచించారు. విచారణకి ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని చెప్పారు.
జూన్ 11వ తేదీన వాడిన రెండు సెల్ ఫోన్లు తీసుకొని రావాలని సిట్ అధికారులు ప్రభాకర్ రావును ఆదేశించారు. గత సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని కోరారు. రెండు సెల్ ఫోన్లతో పాటు ప్రభాకర్ రావు వాడిన లాప్ టాప్, మ్యాక్ బుక్ తీసుకురావాలని చెప్పారు. 8 గంటల పైగా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఇవాళ జరిగిన విచారణలో ప్రణీతరావుతో పాటు ఎస్ఐబీ చీఫ్గా కార్యకలాపాలపై విచారణ జరిగింది. ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్ల ధ్వంసంతో పాటు డేటా మాయంపై ప్రశ్నలు కురిపించారు. కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసిన ఉగ్రవాద, తీవ్రవాద సమాచార మాయంపై ఆరా తీశారు. ప్రణీత్ రావుకి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయమని చెప్పిన వారెవరు?, పాత హార్డ్ డిస్క్లు తీసి కొత్తవి పెట్టమని చెప్పిన వారు ఎవరు? అంటూ విచారణ ప్రశ్నలు కురిపించారు.
Also Read
- Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
- PM Modi: ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి.. వివాటెక్ ఈవెంట్లో పాల్గొన్న మోడీ
- Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
- AP High Court: ‘వెళ్లి సరెండర్ అవ్వండి’.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Also Read: Bhatti Vikramarka: వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు పైబడి గెలుస్తాం!
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగ రావు, తిరుపతన్నను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ కేసు నమోదైన సమయంలోనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు.ఆయన తిరిగి రాకపోవడంతో పోలీసులు పాస్పోర్టు రద్దు చేయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.
తాజావార్తలు
-
Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
-
PM Modi: ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి.. వివాటెక్ ఈవెంట్లో పాల్గొన్న మోడీ
-
TGPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల.!
-
Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
ట్రెండింగ్
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!