Kanvar Travel: నేమ్ ప్లేట్ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..విచారణ ఎప్పుడంటే..?
- జులై 22 ఉత్తర్ ప్రదేశ్ లో కన్వర్ యాత్ర ప్రారంభం
- ఆహారం విషయంలో భక్తులకు కొన్ని ప్రత్యేక నియమాలు
- మార్గంలోని దుకాణాలపై నేమ్ ప్లేట్లను అమర్చాలని ప్రభుత్వాదేశం
- దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న వివాదం
- తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎన్జీవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్వర్ యాత్ర సందర్భంగా కన్వర్ మార్గంలోని దుకాణాలపై నేమ్ ప్లేట్లను అమర్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించడంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ప్రతిపక్షాలు ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుండగా.. మరోవైపు ఈ ఉత్తర్వులపై ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనే ఎన్జీవో నేమ్ ప్లేట్కు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్జీవో జూలై 20 ఉదయం 6 గంటలకు ఆన్లైన్లో ఈ పిటిషన్ను దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై జులై 22 న విచారించనుంది. జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
READ MORE: Tummala Nageswara Rao: అన్ని శాఖల అధికారులకు మంత్రి తుమ్మల క్లాస్..
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ఉత్తర్ ప్రదేశ్ లో ప్రతి ఏటా శివభక్తులు కన్వర్ యాత్ర చేస్తారు. జులై 22 సోమవారం నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది. శివుడికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో ఈ కన్వర్ యాత్ర ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల మంది ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ కన్వార్ రూట్లోని దుకాణాలకు నేమ్ ప్లేట్లు అమర్చాలని ప్రభుత్వం నిర్దేశించింది. తాజాగా ఈ వివాదంపై దేశ వ్యాప్తంగా వివాదం కొనసాగుతోంది. యాత్రలో పాల్గొనే భక్తులు ఆహార పదార్థాల విషయంలో కొన్ని కఠినమైన నియమాలు పాటిస్తారు. ఆ నియమాలకు అనుగుణంగా యాత్ర కొనసాగే ప్రదేశంలో ఆహారపదార్థాల దుకాణాలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి దుకాణం ఎదుట యజమాని పేరు రాసిఉంచాలని.. అప్పుడే భక్తులు వారి నియమాలకు అనుగుణంగా ఉండే దుకాణంలో కొనుగోళ్లు జరుపుతారని ప్రభుత్వం అభిప్రాయపడింది. ముస్లిం దుకాణదారులకు నష్టం జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!