Kanvar Travel: నేమ్ ప్లేట్ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..విచారణ ఎప్పుడంటే..?
- జులై 22 ఉత్తర్ ప్రదేశ్ లో కన్వర్ యాత్ర ప్రారంభం
- ఆహారం విషయంలో భక్తులకు కొన్ని ప్రత్యేక నియమాలు
- మార్గంలోని దుకాణాలపై నేమ్ ప్లేట్లను అమర్చాలని ప్రభుత్వాదేశం
- దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న వివాదం
- తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎన్జీవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్వర్ యాత్ర సందర్భంగా కన్వర్ మార్గంలోని దుకాణాలపై నేమ్ ప్లేట్లను అమర్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించడంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ప్రతిపక్షాలు ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుండగా.. మరోవైపు ఈ ఉత్తర్వులపై ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనే ఎన్జీవో నేమ్ ప్లేట్కు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్జీవో జూలై 20 ఉదయం 6 గంటలకు ఆన్లైన్లో ఈ పిటిషన్ను దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై జులై 22 న విచారించనుంది. జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
READ MORE: Tummala Nageswara Rao: అన్ని శాఖల అధికారులకు మంత్రి తుమ్మల క్లాస్..
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ఉత్తర్ ప్రదేశ్ లో ప్రతి ఏటా శివభక్తులు కన్వర్ యాత్ర చేస్తారు. జులై 22 సోమవారం నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది. శివుడికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో ఈ కన్వర్ యాత్ర ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల మంది ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ కన్వార్ రూట్లోని దుకాణాలకు నేమ్ ప్లేట్లు అమర్చాలని ప్రభుత్వం నిర్దేశించింది. తాజాగా ఈ వివాదంపై దేశ వ్యాప్తంగా వివాదం కొనసాగుతోంది. యాత్రలో పాల్గొనే భక్తులు ఆహార పదార్థాల విషయంలో కొన్ని కఠినమైన నియమాలు పాటిస్తారు. ఆ నియమాలకు అనుగుణంగా యాత్ర కొనసాగే ప్రదేశంలో ఆహారపదార్థాల దుకాణాలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి దుకాణం ఎదుట యజమాని పేరు రాసిఉంచాలని.. అప్పుడే భక్తులు వారి నియమాలకు అనుగుణంగా ఉండే దుకాణంలో కొనుగోళ్లు జరుపుతారని ప్రభుత్వం అభిప్రాయపడింది. ముస్లిం దుకాణదారులకు నష్టం జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!