Perni Nani: అన్ని వర్గాల వారు జగన్కు అండగా ఉన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని వర్గాల వారు సీఎం జగన్కు అండగా ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కాపు సామాజిక వర్గంను మోసం చేశారని.. కాపులను బీసీ చేస్తానని చేయలేదని ఆరోపించారు. కాపులకు ఏం చేస్తానో చెప్పి.. చేసి చూపించిన వ్యక్తి వైయస్ జగన్ అని అన్నారు. దళితులను జగన్ కు దూరం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు.. ఆ ప్రయత్నాలు ఫలించలేదని పేర్ని నాని మండిపడ్డారు. బీసీలు కూడా చంద్రబాబు తమను వాడుకుని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది వైఎస్ జగన్.. ఇది వాళ్లకు కూడా తెలుసని తెలిపారు. మహిళలను కూడా చంద్రబాబు మోసం చేశారని.. ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. మహిళ లోకం ఇవాళ జగన్ కు అండగా ఉందని పేర్కొన్నారు.
Solar Storm: భూమిని తాకిన శక్తివంతమైన “సౌర తుఫాను”.. కమ్యూనికేషన్, పవర్ గ్రిడ్లకు అంతరాయం..!
Also Read
- Test Cricket: డబ్ల్యూటీసీ రేసులో అసలైన డ్రామా.. 9 మ్యాచ్లు, 7 గెలుపులు.. టీమిండియా మైండ్ గేమ్ మొదలు..
- Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
- Rohit Sharma New Look: హిట్మ్యాన్ ఫొటో లీక్ చేసిన రవిశాస్త్రి.. కొత్త లుక్తో ట్రెండింగ్లో రోహిత్ శర్మ
- Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
కొవిడ్ సమయంలో వైయస్ జగన్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుందని పేర్ని నాని తెలిపారు. వాలంటరీలు కొవిడ్ సమయంలో ఎలా సాయం చేశారో ప్రజలు గుర్తు తెచ్చుకోండని అన్నారు. మరోవైపు.. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై టీడీపీ పుకార్లు షికార్లు చేయిస్తున్నదని మండిపడ్డారు. 2019లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆస్తి పత్రాలు వాళ్ళ దగ్గర ఎందుకు ఉన్నాయి ? అని ప్రశ్నించారు. ఎవరు ఆస్తులు కొనుక్కుంటే… వాళ్ళ దగ్గర ఆస్తుల పత్రాలు ఉన్నాయని తెలిపారు. ల్యాండ్ ఎన్నికల కమిషన్ ఏం చేసుకుంటావో చేసుకో అని.. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై టీడీపీ ప్రకటనలు ఇచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ ఇచ్చిన కండకావరంతోనే టీడిపి ఇదంతా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ ఎందుకు కొరడా జూలిపించడం లేదని మండిపడ్డారు.
IPL 2024: రికార్డ్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 17వ సీజన్..
మరోవైపు.. గతంలో వాలంటరీ వ్యవస్థను తప్పుపట్టిన టీడీపీ.. ఇప్పుడు కొనసాగిస్తుమని చెబుతుందని పేర్ని నాని తెలిపారు. ల్యాండ్ టైటిల్ చట్టంలో లేని అంశాలను ప్రచారం చేస్తున్నది టీడీపీనేనని పేర్కొ్న్నారు. రాజకీయంగా జగన్ ఎదుర్కోలేక.. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై దుర్మార్గంగా టీడీపీ ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. అయిదేళ్లుగా మీ ఆస్తులపై లోన్ లు తెచ్చుకుంటున్నారు కదా ? జగన్ ఎలా తనఖా పెడతారు ?అని ప్రశ్నించారు. ఒకే ఆస్తికి బ్యాంకు రెండు లోన్లు ఇస్తాయా ? ప్రజలు ఆలోచించాలన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కోసం ఆరు వేల గ్రామాల్లో సర్వే జరిగింది.. ఆ గ్రామాల్లో ఆస్తులకు ఏమైనా ఇబ్బంది అయ్యిందా ? అని పేర్ని నాని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా ఉండగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తప్పుడు చట్టం అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పగలరా ? అని అన్నారు.
తాజావార్తలు
-
Test Cricket: డబ్ల్యూటీసీ రేసులో అసలైన డ్రామా.. 9 మ్యాచ్లు, 7 గెలుపులు.. టీమిండియా మైండ్ గేమ్ మొదలు..
-
Telangana Rains: గోదావరి ఉగ్రరూపం.. ములుగు జలదిగ్బంధం, జూరాల గేట్లు ఎత్తివేత.!
-
SS Rajamouli: ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ప్లాన్ ఇదేనా..?
-
Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
-
Rohit Sharma New Look: హిట్మ్యాన్ ఫొటో లీక్ చేసిన రవిశాస్త్రి.. కొత్త లుక్తో ట్రెండింగ్లో రోహిత్ శర్మ
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!