MLA Parthasarathy: పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనను గుర్తించలేదు.. ఇది దురదృష్టకరమని అన్నారు. తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యే కాదు సేవకుడిగా ఉంటానని తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు ఎమ్మెల్యే పార్థసారథి.
Read Aslo: Revanth Reddy : డబుల్ ఇంజన్ అంటే అదానీ.. ప్రధాని..
వైసీపీ సామాజిక బస్సు యాత్రలో పార్థసారథి మాట్లాడుతూ.. నామినేషన్ వేసిన ప్రతీసారి సారథి ఓడిపోయాడు.. పెనమలూరు తెలుగుదేశందేనని చెప్పుకుంటుంది. కానీ అన్నీ వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికల్లో గెలుస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే.. వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుల- చేర్పుల కసరత్తులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Aslo: Kalki 2898AD: సలార్ ను రేపు ఒక్కరోజు పక్కన పెట్టండి మావా.. కల్కి వస్తున్నాడు