దేశం కోసం ప్రాణాలర్పించిన అసలైన దేశభక్తులు సర్దార్ భగత్ సింగ్, షాహిద్ రాజగురు, షాహిద్ సుఖదేవ్ లని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నేడు భగత్ సింగ్ వర్థంతిని పురస్కరించుకొని ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. “దేశం కోసం చనిపోయేవారు ఎల్లకాలం బతికే ఉంటారు”.. అంటారు శ్రీ భగత్ సింగ్. స్వర్గీయ భగత్ సింగ్, శివరాం రాజ్ గురు, సుఖదేవ్ థాపర్ విషయంలో ఈ పలుకులు అక్షర సత్యం అనిపిస్తాయి. మరణించి అమరులైనా నిరాకారంతో మన మధ్య జీవిస్తూనే ఉన్న వీరు చిరంజీవులు. సరిగ్గా ఇదే రోజున అంటే.. మార్చి 23, 1931న ఈ ముగ్గురు వీరులు దేశమాత దాస్యశృంఖలాలను తెంచడానికి లాహోర్ జైలులో ఉరి కంబాన్ని ముద్దాడారు. పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే ఈ ముగ్గురూ దేశంలో రగిలించిన స్వతంత్ర కాంక్ష, విప్లవాగ్ని పరాయి పాలకులు దేశం నుంచి పారిపోయేంత వరకు జ్వలిస్తూనే ఉన్నాయి.
Also Read : Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడనుందా..? 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్లో భారీ కుదుపు
ఈ పుణ్య తిథి నాడు ఆ అమరవీరులకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను. ఈ వీరుల బలిదానాలను స్మరించుకోడానికి ఏటా ఈ రోజున షహీద్ దివస్ (అమరుల సంస్మరణ) నిర్విహించుకుంటున్నాము. అయితే ఇది మాత్రమే సరిపోదని నా భావన. ఈ మహానీయులను నిత్యం స్మరించుకోవాలి. అందుకు తగిన విధంగా ఈ వీరుల విగ్రహాలను దేశవ్యాప్తంగా విరివిగా ఏర్పాటు చేయాలి. స్మారక స్తూపాలు నెలకొల్పాలి. వీరి చరితను చిరంతనంగా మన యువతకు అందించాలి. జాతిని నిత్యం జాగృతం చేయాలి. చివరిగా.. “నన్ను చంపవచ్చు కానీ నా ఆలోచనలు చంపలేరు” అంటారు భగత్ సింగ్. నిజమే ఈ వీరుల ఆలోచనలు, భావ గాఢత దేశభక్తుల మదిలో పదిలంగా ఉన్నాయి. – జైహింద్’ అంటూ పవన్ కల్యాణ్ ప్రకటనను విడుదల చేశారు.
Also Read : Arvind Kejriwal: రాహుల్ గాంధీని ఇలా కేసులో ఇరికించడం సరికాదు.
