Pawan Kalyan: నేడు బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్..
- నేడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని
- డిప్యూటీ సీఎంతో పాటు పవన్ కు పంచాయతీరాజ్.. గ్రామీణ నీటి సరఫరా.. పర్యావరణం.. అడవులు.. సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక శాఖలు
- ఈ రోజు ఉదయం 9.30కి విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.. విజయవాడలో తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయంతో పాటు.. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ను మంగళవారం రోజే పరిశీలించారు పవన్.. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్తున్న జనసేనానికి అపూర్వ స్వాగతం పలికారు అమరావతి రైతులు.. దారిపొడవునా పూల వర్షం కురిపిస్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. సచివాలయంలోకి ఉద్యోగుల అద్భుత ఆహ్వానం పలికారు.. ఇక, సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గంటన్నరపాటు సమావేశమైన వివిధ అంశాలపై చర్చించారు..
Read Also: Viral Fevers: వాతావరణంలో మార్పు.. పిల్లలపై విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్
Also Read
- Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులు కడుతూనే.. రైతులకు డబుల్ సాయం చేస్తున్నాం
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
- CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
మరోవైపు.. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక మంత్రిత్వ శాఖలను పవన్ కల్యాణ్కు కేటాయించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించగా.. పవన్ కల్యాణ్ నేడు బాధ్యతలు తీసుకోనున్నారు.. ఈ రోజు ఉదయం 9.30కి విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.. ఆ తర్వాత ఉదయం 11.30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు జనసేనాని.. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్-1, గ్రూప్-2 అధికారులతో చర్చించనున్నారు.. అనంతరం మధ్యాహ్నం 12.30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో భేటీ కానున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జయకేతనం ఎగురవేశారు పవన్ కల్యాణ్. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,279 ఓట్ల భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు.. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 164 స్థానాలు వస్తే.. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Lenin Trailer : అక్కినేని ఫ్యాన్స్కు పూనకాలే.. ‘లెనిన్’ ట్రైలర్లో కరుక్షేత్రం చూశారా?
-
Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులు కడుతూనే.. రైతులకు డబుల్ సాయం చేస్తున్నాం
-
UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
-
Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
-
CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
ట్రెండింగ్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ