Pawan Kalyan: నేడు బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్..
- నేడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని
- డిప్యూటీ సీఎంతో పాటు పవన్ కు పంచాయతీరాజ్.. గ్రామీణ నీటి సరఫరా.. పర్యావరణం.. అడవులు.. సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక శాఖలు
- ఈ రోజు ఉదయం 9.30కి విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.. విజయవాడలో తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయంతో పాటు.. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ను మంగళవారం రోజే పరిశీలించారు పవన్.. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్తున్న జనసేనానికి అపూర్వ స్వాగతం పలికారు అమరావతి రైతులు.. దారిపొడవునా పూల వర్షం కురిపిస్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. సచివాలయంలోకి ఉద్యోగుల అద్భుత ఆహ్వానం పలికారు.. ఇక, సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గంటన్నరపాటు సమావేశమైన వివిధ అంశాలపై చర్చించారు..
Read Also: Viral Fevers: వాతావరణంలో మార్పు.. పిల్లలపై విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్
Also Read
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Crispy Bread Pakoda Recipe: పిల్లలు ఎగబడి తినే స్నాక్.. ఇంట్లోనే కరకరలాడే బ్రెడ్ పకోడా ఇలా తయారు చేసుకోండి!
మరోవైపు.. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక మంత్రిత్వ శాఖలను పవన్ కల్యాణ్కు కేటాయించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించగా.. పవన్ కల్యాణ్ నేడు బాధ్యతలు తీసుకోనున్నారు.. ఈ రోజు ఉదయం 9.30కి విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.. ఆ తర్వాత ఉదయం 11.30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు జనసేనాని.. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్-1, గ్రూప్-2 అధికారులతో చర్చించనున్నారు.. అనంతరం మధ్యాహ్నం 12.30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో భేటీ కానున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జయకేతనం ఎగురవేశారు పవన్ కల్యాణ్. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,279 ఓట్ల భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు.. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 164 స్థానాలు వస్తే.. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయిన విషయం విదితమే.
తాజావార్తలు
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!