Pawan Kalyan: ఎన్డీఏ.. టీడీపీతో పొత్తుపై పవన్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఎన్డీఏతో పాటు తెలుగుదేశం పార్టీతో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పెడన వారాహి యాత్రలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జనసేనాని. దేశంలో అత్యధికంగా దేశద్రోహ కేసులు పెట్టింది ఏపీలోనే అన్నారు పవన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని అన్నారు. కేసులకు భయపడేవారు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారంటూ ప్రశ్నించారు. టీడీపీ అనుభవం, జనసేన పోరాటం కలిస్తే రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమవుతుందన్నారు పవన్. టీడీపీ, జనసేన కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్. టీడీపీ మీద కేసులు పెడితే తాము వస్తామని, మాపై కేసులుపెడితే మీరు రావాలని కోరారు. రెండు పార్టీల కార్యకర్తలు కలిసి రాష్ట్రంనుంచి వైసీపీని తరిమేద్దామంటూ పిలుపునిచ్చారు.
Read Also: Kasthuri Shankar: గంటకు ఐదు వేలు వస్తాయ్.. నీకెందుకు బిగ్ బాస్
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
టీడీపీ అనుభవం, జనసేన పోరాట పటిమ కలిస్తే జగన్ను అథఃపాతాళానికి తొక్కేయవచ్చన్నారు పవన్ కల్యాణ్. టీడీపీ కష్టాల్లో ఉన్నందుకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మద్దతుగా నిలిచానన్నారు పవన్. సీఎం జగన్ కు తానంటే ఎంతో ప్రేమ అని సెటైర్లు పేల్చారు పవన్. తన సినిమాలప్పుడే టికెట్ల రేట్లు తగ్గిస్తారని, తన పుట్టిన రోజప్పుడే .. జగన్ కు పర్యావరణం గుర్తొస్తుందన్నారు పవన్. కేసులకు భయపడేవారు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారని సీఎం జగన్ను ప్రశ్నించారు పవన్ కల్యాణ్. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కేసు పెడుతున్నారని అన్నారు. దేశంలోనే అత్యధికంగా ఈ కేసులు పెట్టింది ఏపీలోనే అంటూ మండిపడ్డారు. దేశభక్తితో పోరాటం చేస్తున్న తాను కేసులకు బయపడనన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!