Pawan Kalyan: జనవాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో జనసేన నిర్వహించ తలపెట్టిన జనవాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేశామని తెలిపారు పవన్ కళ్యాణ్. ఐదు నెలల క్రితమే జనవాణి కార్యక్రమం నిర్ణయం చేసాము. విశాఖ గర్జన కు పోటీగా మేము పెట్టలేదు వారి కార్యక్రమం భగ్నం చేసే ఉద్దేశ్యం మాకు లేదు. మేము ఏం చెయ్యాలో వైసీపీ నేతలు చెబుతారా? మేము ఏ కార్యక్రమం చేస్తామో మీకు చెప్పాలా? అన్నారు. జనవాణి జనం గొంతుక. సమస్యలు ప్రభుత్వం పరిష్కారిస్తే మా దగ్గర కు ఎందుకు వస్తారు. 3000 కు పైగా జనవాణి కార్యక్రమానికి పిటిషన్లు వచ్చాయి. వాటికి సంబంధించి ఆయా శాఖలకు తెలిపాం అన్నారు పవన్ కళ్యాణ్.
మా తండ్రి పోలీస్ కానిస్టేబుల్. అందుకే పోలీసులు అంటే నాకు గౌరవం. నిన్న ఓ పోలీస్ అధికారి వాహనం ఎక్కి అభివాదం వద్దంటున్నారు అది చాలా బాధ అనిపించింది. నిన్న వైసీపీ ప్రభుత్వనికి పోలీసులు కొమ్ముకాసారు. మీ మీద నమ్మకం లేదన్న నాయకుడు ఈ రోజు సీఎం. మీరు అంతా పవర్ పుల్ అయితే వివేకానంద హత్య కేసు లో ఎందుకు చేధించలేకపోయారు. ఎందుకు నిందితులను అరెస్టు చెయ్యలేదు. గంజాయి వ్యాపారం చేసే వారిని దోపీడీలు చేసేవారిని వదిలేస్తారు. ప్రజలు సమస్యలు గొంతెత్తే గొంతు నొక్కుతున్నారు. రాజధాని పై మా నిర్ణయం చెప్పాం.
Also Read
Read ALso:PM Narendra Modi: ప్రధాని చేతుల మీదుగా డీబీయూల ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న మోదీ
2014లోనే రాజధాని విశాఖ,కర్నూలు,అమరావతి అని ఎందుకు చెప్పలేదు. అప్పుడు చెబితే మేము అదే రాజధాని అని చెప్పే వాళ్ళం. రాయలసీమ నుండి సీఎంలుగా ఉమ్మడి రాష్ట్రంలో పాలన చేసారు మరి అభివృద్ధి ఎందుకు చెయ్యలేదు? మీరు చిలకపలుకులు బూతులు తిట్టడానికి రాజధాని వికేంద్రీకరణ కావాలి. ఉత్తరాంధ్ర నుండి అనేక నాయకులు ఉన్నారు మరి ఏంచేసారు. ఒక వ్యక్తి తీసుకున్నా నిర్ణయం వల్ల అనేక పరిశ్రమలు వెళ్లపోయాయి. వాటాల లేవని ఇలా చేసారా? ఒక్క వ్యక్తి చేతుల్లో అధికారం ఉంచుకోని మీరు వికేంద్రీకరణ గురించి మాట్లాడతారా ?
వారికి అధికారం ఇవ్వడం పేరుకే మంత్రులు. నిన్న ఊహించలేదు అంత మంది వస్తారని. ప్రజల నుండి గర్జన రావాలి కడుపు కాలినవాడు గర్జిస్తాడు. మీరు చేసిన గర్జన ఏంటో నిన్ననే తెలిసింది. మేము పోలీసులు తో గొడవ పెట్టుకోవడం ఘర్షణ చేయ్యడం మాకు చేతకాక కాదు. నిన్న పోలీసులు గొడవ పెట్టుకోవాలంటు నన్ను రెచ్చగొట్టారు. కాని నాకు పోలీసులు అంటే గౌరవం ఉంది. అభివాదానికి ప్రతి వాదం చేస్తే 100 మందిని తీసుకెళ్లారు. సంబంధం లేని వ్యక్తులపై హత్యయత్నం కేసు నమోదు చేసారు.రెచ్చగొట్టడానికి నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి.
కాని ప్రజాస్వామ్యంలో ఉన్నాం దానికి గౌరవం ఇవ్వాలి. వైసీపీ గుండా గాళ్ళుకు ఒక్కటే చెబుతున్నా మీ ఉడత ఉపులకు భయపడను. 70 లక్షలు ఈ రోజు పంపణీ చెయ్యాలి. జనవాణి వినతులు తీసుకోవాలి. కాని మా వాళ్ళను విడిచిపెట్టేంత వరకు జనవాణి నిర్వహించం. వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూస్తానన్నారు. విశాఖ ప్రశాంత నగరం అలాంటి చోట గొడవలు చూస్తే బాధగా ఉందన్నారు. నేను మూడు సార్లు పెళ్ళి చేసుకున్నానని మూడు రాజధానులు పెట్టాలా? మీరు కూడా విడాకులిచ్చి.. పెళ్లిళ్లు చేసుకోండి అన్నారు పవన్.
Read ALso: Geeta Singh: అవకాశాలు వస్తే చేస్తా.. సినీ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువ..
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!