AP NEWS: జనాల్లోకి జనసేనాని.. వారాహిపై ప్రచారానికి సిద్ధమైన పవన్ కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP NEWS: వారాహి రోడ్డెక్కే సమయం ఆసన్నమైంది. వారాహి కోసం, వారాహిలో వచ్చే పవన్ కల్యాణ్ ఎప్పుడెప్పుడు రోడ్డుపైకి వచ్చి ప్రచారంలో పాల్గొంటారా అని.. అటు జనసైనికులతో పాటు పవన్ కల్యాణ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ వారాహిపై ప్రచారంపై మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో గోదావరి జిల్లాల నేతలతో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టే వారాహి యాత్ర పై ప్రత్యేకంగా చర్చించారు. పవన్ ప్రచారానికి రూట్ మ్యాప్ని ఇప్పటికే సిద్ధం చేసారు. ఈనెల 14 నుంచి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ప్రచార యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో షెడ్యూల్ ఖరారు చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేలా కార్యక్రమాలు ఉండబోతున్నట్లు నాదెండ్ల తెలిపారు. యాత్రలో భాగంగా వివిధ వర్గాలను కలుస్తారని.. ప్రతి రోజూ ఓ ఫీల్డ్ విజిట్ ఉంటుందంటూ నాదెండ్ల మనోహర్ సమావేశంలో తెలిపారు. ఈ ప్రకటనతో జనసైనికుల్లో జోష్ వచ్చేసింది.
Read Also: Richard rishi : కూతురు వయసున్న హీరోయిన్ తో నటుడు ప్రేమాయణం?
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
అయితే పవన్ ఎన్నికల ప్రచారం కోసం వారాహిని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. చుట్టూ ప్రత్యేక లైటింగ్ తో పాటు వెరీ హైఎండ్ సెక్యూరిటీ సిస్టమ్ను ఫిట్ చేశారు. సభల్లో పవన్ ప్రసంగం స్పష్టంగా వినిపించేలా లేటెస్ట్ సౌండ్ సిస్టం, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్కి రియల్ టైంలో వెళ్లేలా ప్రజెంట్ టెక్నాలజీతో ఉపయోగించారు. వాహనం లోపల పవన్ కల్యాణ్ తో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునేలా.. అలాగే హైడ్రాలిక్ లిప్ట్ ద్వారా పవన్ వాహనం పైకి చేరుకునేలా సిస్టం అమర్చారు. అంతకుముందు వారాహి వాహనం రంగుపై పెను సంచలనమైన విషయం తెలిసిందే. ఆర్మీ వాహనాలకు ఉపయోగించే ఆలివ్ గ్రీన్ రంగును వినియోగించారంటూ విమర్శలు వచ్చాయి. కానీ అది నిబంధనలకు అనుగుణంగానే ఉందని తెలంగాణ రోడ్డు ట్రాన్స్ పోర్టు అధికారులు స్పష్టం చేశారు.
Read Also: Tirumala Ghat Road Accidents: తిరుమల ఘాట్ రోడ్డులో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. భక్తుల్లో భయం
వారాహికి తొలిసారిగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పవన్ కల్యాణ్ పూజలు చేయించారు. ఆ తరువాత విజయవాడ వచ్చి దుర్గమ్మ సన్నిధిలోను ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా దుర్మమ్మకు పవన్ కల్యాణ్ చీర, సారె సమర్పించారు. ఆ తరువాత వారాహి వాహనాన్ని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉంచారు. ఈ క్రమంలో ఇక పవన్ కల్యాణ్ వారాహిపై జనాల్లోకి రానున్నారు. దీంతో జనసైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
తాజావార్తలు
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!