Pawan Kalyan: జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన “పార్టీ పదవులు ఇస్తే పార్టీ కోసం మీరు ఏం చేస్తున్నారు?” అంటూ నేతలను నిలదీశారు. పార్టీపై, తనపై అసత్య ఆరోపణలు జరుగుతున్న సమయంలో నేతలు మౌనంగా ఉండటంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనపై, నా మీద అబద్ధపు ప్రచారం జరుగుతున్నా ఎందుకు తిప్పికొట్టడం లేదు? అని ప్రశ్నించారు. పార్టీ తరఫున గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Air India: ఎయిర్ ఇండియాకు తప్పిన భారీ ప్రమాదం.. ఇంధన స్విచ్ ‘‘రన్’’ నుంచి ‘‘కట్ ఆఫ్’’కి మార్పు..
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరోసారి హెచ్చరించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఏం చేస్తున్నారనే పూర్తి సమాచారం తన వద్ద ఉందని తెలిపారు. ఎవరు ఎంత పని చేస్తున్నారు? ఎవరు బాధ్యతలు నిర్వర్తించట్లేదో అన్నది తనకు స్పష్టంగా తెలుసునని అన్నారు. ఇకపై నేతల తీరు మారాల్సిందేనని, లేదంటే ఉపేక్షించేది లేదని హెచ్చరిక జారీ చేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజల నమ్మకం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
అంతేకాకుండా, పార్టీలో క్రమశిక్షణ తప్పనిసరి అని స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు పవన్ కళ్యాణ్. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, పార్టీ లక్ష్యాల కోసం పనిచేసే వారికే జనసేనలో స్థానం ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు.
