Pawan Kalyan: సీఐ అంజూయాదవ్పై ఎస్పీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు.. లేఖలో ఏముందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన నేత సాయిపై దాడి చేసిన శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్, రెండు చెంపలు వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. మీడియాలోనూ ప్రముఖంగా ప్రసారం అయ్యింది.. ఈ ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించి సీఐ అంజూయాదవ్కు నోటీసులు జారీ చేసింది.. ఇక, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై చేయి పడితే తానే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు తిరుపతికి వెళ్లారు.. సీఐ అంజూయాదవ్పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డికి ఫిర్యాదు చేశారు.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి తిరుపతికి చేరుకున్నారు.. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి.. ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: Madhyapradesh: దారుణం..అప్పును ఇవ్వమన్నందుకు మామను ముక్కలుగా నరికిన అల్లుడు..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశాను.. ఎవరికి ఇబ్బంది లేకుండా.. ఆయుధాలు లేకుండా శాంతియుత నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు.. సాయి శాంతియుతంగా నిరసన చేపట్టారు.. కానీ, సీఐ రాజ్యంగా విరుద్ధంగా సాయిని కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నేతలు చాలా క్రమశిక్షణతో ఉంటారు.. పోలీసులకు ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉంటుంది.. దానిని ఒకస్థాయి వరకు అర్థం చేసుకుంటాం.. కానీ, ఇలా ప్రవర్తించడం మాత్రం సరికాదన్నారు.. ఇక, సుమోటోగా కేసు తీసుకున్న మానవ హక్కల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ, జనసైనికులు క్రమశిక్షతో ఉంటారు.. పోలీసులు అంత డిసిప్లెన్ లా అండ్ ఆర్డర్ ని కాపాడాలి.. హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇక, తిరుపతి పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!