Patnam Narendar Reddy : ఆరు గ్యారంటీలు మరచి అరెస్టులపై శ్రద్ధ
- ఆరు గ్యారంటీలు మరచి అరెస్టులపై శ్రద్ధ
- అల్లు అర్జున్ పై అసెంబ్లీలో గంట చర్చ అవసరమా..?
- కక్ష సాధింపే సంక్షేమ పాలననా : పట్నం నరేందర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patnam Narendar Reddy : ఆరు గ్యారంటీ ల గురించి అసెంబ్లీలో చర్చ సైడ్ ట్రాక్ మళ్లించేందుకే అల్లు అర్జున్ పై అనవసర చర్చ పెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి పై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తప్పు పట్టారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష్యసాదింపులో భాగంగానే లగచర్ల కేసులో నాపై తప్పుడు కేసులు బనాయించి 37 రోజులు జైల్లో ఉంచి పైశాచిక ఆనందం పొందారన్నారు. ప్రజా సంక్షేమం అంటూ అధికారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అంటూ అమాయక ప్రజలను ఆకట్టుకొని ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓట్లు వేసిన రైతులకు బీడీలు వేసిన ఘనత దేశంలో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి కే చెల్లిందన్నారు.
తనను కూడా వాకింగ్ చేస్తూ ఉండగా ఏదో పెద్ద రౌడీని అరెస్టు చేసినట్లుగా వారెంటు లేకుండా తీసుకువెళ్లారన్నారు. లగచర్ల దాడిలో కేటీఆర్ చెప్పడం వల్లే ఇలా దాడి చేయించాను అంటూ తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా కేటీఆర్ ఇరికించే ప్రయత్నం చేశారన్నారని తప్పు పట్టారు. రిమాండ్ రిపోర్టు తనను చదవకుండానే అరెస్టు చేయించారంటూ జైలు నుంచే జడ్జి లెటర్ పంపించాను అన్నారు. పూటకు ఓ కేసు పెట్టి ఆరు గ్యారంటీల అమలును పక్కనపెట్టి అల్లు అర్జున్ చర్చను గంటన్నర పాటు కావాలని అసెంబ్లీలో చర్చించారన్నారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
సినిమా ప్రివ్యూ షో తొక్కిసలాటలో ఓ మహిళ రేవతి చనిపోవడం చాలా బాధాకరమైన విషయమే. కానీ ఈ సంఘటనకు థియేటర్ యాజ మన్యం పై కేసు నమోదు చేసి చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలని తప్ప అనవసరంగా అల్లు అర్జున్ ఇరికించడం సరికాదన్నారు. బాధిత మహిళ చనిపోయిన రేవతికు కుటుంబాన్ని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కొడుకు వైద్య పరీక్షలు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ పై ఉందని తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా అరెస్టులు, కేసులు పెట్టి రైతులకు బేడీలు వేయడం మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో పరిమాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!