ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. భారీ ఎత్తున ఆస్తులు, ప్రాణ నష్టం జరుగుతున్నాయి. తాజాగా బుషెహర్ విమానాశ్రయంపై దాడి చేశాయి. దీంతో పార్క్ చేసిన ప్రయాణికుల విమానం ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం నేలపై ధ్వంసమైందని ఇరానియన్ మీడియా పేర్కొంది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండ్ సెంటర్లు, క్షిపణి సౌకర్యాలు, వైమానిక రక్షణ, నాయకత్వ సమ్మేళనాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Virosh : అభిమానులతో కలిసి భోజనం చేసిన ‘విరోష్’.. విజయ్-రష్మికల సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
మెహర్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయం లక్ష్యంగా దాడులు జరిగాయని తెలిపింది. రన్వే వెనుక ఆకాశం నుంచి బూడిద రంగు పొగ మేఘం పైకి లేచినట్లు చూపించే ఫొటోలను ప్రచురించింది. రాజధానికి పశ్చిమాన మెహ్రాబాద్ విమానాశ్రయం చుట్టూ ఉన్న ప్రాంతంపై దాడి చేశారని అది తెలిపింది.
ఇది కూడా చదవండి: Shivaji: అలా 1800 కోట్లు పోగొట్టుకున్న శివాజీ
A passenger plane was destroyed following the US-Israeli attack on Bushehr airport.
Follow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/uoA2svZCl7
— Press TV 🔻 (@PressTV) March 3, 2026