Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పురోగతి.. అస్థిపంజర అవశేషాలు లభ్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmasthala Case: కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ‘ధర్మస్థల’ ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ సామూహిక ఖనన కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. మృతదేహాలు పూడ్చి పెట్టిన 15 అనుమానిత ప్రదేశాలను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా సిట్ దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. ఇందులో ఆరో ప్రదేశం వద్ద పాక్షిక అస్థిపంజర అవశేషాలు కనుగొన్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. అస్థిపంజర అవశేషాలు పురుషుడివి అయి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ కేసులో లభ్యమైన మొదటి స్పష్టమైన ఆధారంగా నమోదవుతుండటం గమనార్హం.
READ MORE: Panneerselvam: ఎన్డీఏకు గుడ్బై చెప్పిన పన్నీర్ సెల్వం.. స్టాలిన్ను కలిసిన తర్వాత ప్రకటన
Also Read
సంఘటనా స్థలంలోని ఫోరెన్సిక్ బృందం తదుపరి పరీక్ష కోసం అవశేషాలను భద్రపరిచింది. ఫోరెన్సిక్ పరీక్ష అనంతరం అస్థిపంజరానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా.. బుధవారం వరకు ఐదు ప్రదేశాలలో మానవ అవశేషాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని పోలీసు వర్గాలు ధృవీకరించాయి. నేత్రావతి నది వెంబడి ఉన్న ఈ ప్రదేశాలలో మంగళవారం విజిల్బ్లోయర్ సమక్షంలో తవ్వాకాలు చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు, రెవెన్యూ శాఖ సిబ్బంది సమక్షంలో జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి లోతుగా తవ్వినప్పటికీ, ఆ స్థలాల్లో ఎటువంటి అవశేషాలు లభించలేదని తెలిపారు.
READ MORE: AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ముంబైకి సిట్ టీమ్..
తాజావార్తలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!