Paris Olympics 2024: ఎవరు ఈ సరబ్జోత్ సింగ్.?
- పారిస్ ఒలింపిక్స్ 2024 లో షూటింగ్ జోడి మను భాకర్ & సరబ్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో ఈ జంట 16-10తో దక్షిణ కొరియాని ఓడించింది.
- సరబ్జోత్ అంబాలాలోని ధీన్ గ్రామ నివాసి.
Paris Olympics 2024 Sarabjot Singh: పారిస్ ఒలింపిక్స్ 2024 లో షూటింగ్ జోడి మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో ఈ జంట 16-10తో దక్షిణ కొరియాకు చెందిన జిన్ ఓహ్, వోన్హో లీ జోడీని ఓడించింది. ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్లో మనుకి ఇది రెండో పతకం కాగా., సరబ్జోత్ తొలిసారి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇకపోతే సరబ్జోట్ ప్రయాణం గురించి తెలుసుకుందాం. సరబ్జోత్ అంబాలాలోని ధీన్ గ్రామ నివాసి. అతని తండ్రి జతీందర్ సింగ్ ఒక రైతు. తల్లి హర్దీప్ కౌర్ గృహిణి. ఆయన చండీగఢ్ లోని DAV కాలేజీలో చదివాడు. కోచ్ అభిషేక్ రాణా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాడు. సరబ్ జోట్ కు 12-13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వేసవి శిబిరంలో కొంతమంది పిల్లలు ఎయిర్ గన్ లను కాల్చడం చూశాడు. అప్పటి నుంచి అతను ఈ గేమ్ పై ఆసక్తి చూపాడు.
Stock Markets: లాభాలతో ముగిసిన సూచీలు..
Also Read
2019లో సరబ్జోత్ జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 239.6 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆసియా ఛాంపియన్షిప్ 2023లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుచుకోగా.. పారిస్ ఒలింపిక్స్ కోటా సాధించాడు. భోపాల్లో జరిగిన ISSF ప్రపంచ కప్ 2023లో వ్యక్తిగత ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. బాకులో జరిగిన 2023 ప్రపంచకప్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. టీమ్ ఈవెంట్లో 1 బంగారు పతకం, జూనియర్ ప్రపంచ కప్ 2022 మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో రజత పతకం గెలుచుకున్నాడు.
Rashid Khan: రషీద్ ఖాన్ @600 వికెట్లు..
సరబ్జోత్ తన మొదటి ఒలింపిక్స్లో ఆడుతున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్లో 577-16x స్కోర్తో 33 మంది అథ్లెట్లలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. అతను ఎనిమిదో స్థానంలో నిలిచిన జర్మనీకి చెందిన రాబిన్ వాల్టర్ ను పాయింట్లతో ఫైనల్ స్థానం కోల్పోయాడు. టాప్ 8 షూటర్లు మాత్రమే ఫైనల్స్కు చేరుకుంటారు. ఏ సమయంలో తన గత తప్పుల నుండి పాఠాలు తీసుకుంటూ సరబ్జోత్ మనుతో కలిసి పతకాన్ని గెలుచుకోవడంలో విజయం సాధించాడు. సరబ్జోత్, మనుల జోడీ భారత్కు షూటింగ్ లో ఒలింపిక్ చరిత్రలో ఆరో పతకాన్ని అందించింది. పారిస్ ఒలింపిక్స్ వ్యక్తిగత ఈవెంట్లో మను కాంస్య పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2008లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు . వ్యక్తిగతంగా స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా కూడా నిలిచాడు. ఇతడితో పాటు రాజ్యవర్ధన్ సింగ్ 2004లో రజతం, గగన్ నారంగ్ 2012లో కాంస్యం, విజయ్ కుమార్ 2012లో రజతం షూటింగ్లో ఒలింపిక్ పతకాలు సాధించిన ఇతర భారత ఆటగాళ్లు.
తాజావార్తలు
-
High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
-
KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
-
Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..
-
Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
-
Lavanya : మా రామ్ చరణ్ బావకి థాంక్స్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!